“ఆదిపురుష్” సీక్వెల్‌కి రెడీ అయిన ఓం రౌత్.. “ప్రభాస్” ఏమన్నాడంటే..!

“ఆదిపురుష్” సీక్వెల్‌కి రెడీ అయిన ఓం రౌత్.. “ప్రభాస్” ఏమన్నాడంటే..!

by kavitha

Ads

ప్రస్తుతం ప్రభాస్ అనగానే అందరికీ గుర్తుకు వస్తున్న మూవీ ఆదిపురుష్. ఇప్పటివరకు రామాయణ ఇతిహాసం ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఆ చిత్రాలను చూసిన ప్రేక్షకులలో భక్తి పారవశ్యం కలిగేది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ ను మాత్రం వివాదాలు చుట్టూముట్టాయి.

Video Advertisement

‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే నెటిజెన్లు తిడుతున్నారు. రచయితను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నారనే వార్త ఒకటి  నెట్టింట్లో తిరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. వరుసగా డీఫెరెంట్ సినిమాల్ని చేస్తున్నాడు.  సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ముడు వైవిధ్యమైన సినిమాలే. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి  వసూళ్లు సాధించినా, హిట్ కాలేదని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రిలీజ్ అయ్యి పది రోజులు కావొస్తున్న ఏమాత్రం తగ్గడం లేదు.
సినీ, రాజకీయ ప్రముఖుల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీరంద్ర సెహ్వాగ్ కూడా ఈ మూవీ పై కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీలో నటించిన వారెవరూ బయట కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారనే అనే వార్త బయటికి వచ్చింది. ఒక వైపు ఓంరౌత్ ను నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు బ్యాన్ చేయాలనే నిరసనలు వినిపిస్తున్నాయి. ఓంరౌత్ కు జరిగేది కనిపిస్తున్నా, హీరో ప్రభాస్ ను ఆదిపురుష్ సీక్వెల్ ప్రతిపాదనతో సంప్రదించాడంట. అయితే ప్రభాస్ సున్నితంగా రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పై ఇన్ని విమర్శలు, వివాదాలు వచ్చాయి. ఇక సీక్వెల్ చేస్తే ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని ప్రభాస్ తిరస్కరించి ఉండవచ్చు అని అంటున్నారు.

Also Read: “ఆదిపురుష్” సినిమా గురించి.. ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!!

 


End of Article

You may also like