Ads
బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో “కౌన్ బనేగా కరోడ్ పతి”. ఈ షో ఇప్పటి వరకు పదమూడు సీజన్లు ప్రసారమైంది. ఇప్పటివరకు ఎప్పుడూ ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా విజయపథం లో దూసుకెళ్తోంది. కోటి రూపాయలు సంగతి ఎలా ఉన్నా.. ఆ షో లో సరైన సమాధానం చెప్పి లక్ష గెల్చుకున్నా ఆ ఆనందం వేరేగా ఉంటుంది. ఈ షో ఆడే వారికి మాత్రమే కాదు.. చూసేవారికి కూడా విజ్ఞానాన్ని అందిస్తోంది. అందుకే.. ఈ షో కు అంత పాపులారిటీ వచ్చింది.
Video Advertisement
ఎందరో ఈ ప్రోగ్రాం ద్వారా లక్షలు, కోట్ల రూపాయలను గెల్చుకున్నారు. ఇటీవల జోధ్ పూర్ హాస్పిటల్ లో సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్ పని చేస్తున్న సవితా భాటి కి ఈ షో కు వచ్చే అవకాశం లభించింది. ఆమె కూడా అన్ని సమాధానాలు చెప్తూ.. 50 లక్షల రూపాయలను గెల్చుకున్నారు. ఇక పదిహేనవ ప్రశ్న వచ్చేసరికి కోటి రూపాయలు. అయితే.. ఆమె ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. షో నుంచి ఆమె యాభై లక్షలను మాత్రం గెల్చుకున్నారు. అప్పటి వరకు బాగా ఆడిన సవితా పై అందరు ప్రసంసల జల్లు కురిపించారు. అయితే..ఈ కోటి రూపాయల ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేకపోయారు.
అయితే.. ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. “మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1915-16లో టర్కీలో జరిగిన ఏ యుద్ధంలో దాదాపు 16,000 మంది భారత సైనికులు మిత్రదేశాలతో కలిసి ధైర్యంగా పోరాడారు?” అనే ఈ కోటి రూపాయల ప్రశ్న కు సవితా సమాధానం చెప్పలేకపోయారు. ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొందరు నెటిజన్లు ఈ ప్రశ్నకు సమాధానాన్ని కింద కామెంట్స్ లో తెలియ చేస్తున్నారు.
End of Article