పెళ్ళికొచ్చి ఇరుక్కుపోయారు తల్లీ పిల్లలు…17 రోజులుగా భిక్షాటన…చివరికి..?

పెళ్ళికొచ్చి ఇరుక్కుపోయారు తల్లీ పిల్లలు…17 రోజులుగా భిక్షాటన…చివరికి..?

by Anudeep

Ads

లాక్ డౌన్ అని ప్రభుత్వం ప్రకటించగానే దేశం మొత్తం స్తంబించిపోయింది..రవాణా సదుపాయం లేకపోవడంతో ఎక్కడి వాళ్లక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి..ప్రజల ప్రాణాలు రక్షించడానికి , కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వానికి లాక్ డౌన్ ని మించిన పరిష్కారం కనపడలేదు .కానీ లాక్ డౌన్ మూలంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలతో బిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆమె బిక్షాటనకి , లాక్ డౌన్ కి సంబంధం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Video Advertisement

నిజానికి లాక్ డౌన్ ప్రకటించగానే ఇంట్లో కూర్చోవడమే కదా అనుకున్నారు, అది కూడా కొందరు ఇబ్బంది పడ్డారు.దాంతో   పని లేకపోయినా ఏదో ఒక వంకతో బయటికి వచ్చే వారే ఎక్కువయ్యారు . వారి మూలంగా నిజంగా అత్యవసరం వలనో, ఆపద వచ్చో రోడ్లపైకి వచ్చేవారెవరనేది అర్దం కావడంలేదు.. మీడియా కూడా కరోనా అప్డేట్స్లో మునిగిపోవడం వలన ఇలా ఇబ్బందులు పడుతున్న వారి గురించి వార్తలు రాయడమే తగ్గిపోయింది . నిజానికి మనం కదిపితే మన చుట్టే కన్నీరు తెప్పించే గాధలెన్నో.

 

పెద్ద పల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సుబ్లేడ్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరైంది.మార్చి 23న తిరుగు ప్రయాణంలో భాగంగా ఆటోలో మహబూబాబాద్ కు వచ్చింది. ఇక్కడి నుంచి రైలులో పెద్దపల్లికి వెళ్దాలనుకుంది.కాని సరిగ్గా అదే రోజు లాక్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది . దాంతో అక్కడే చిక్కుకుపోయింది.

ఆ ఊరిలో తెలిసిన వాళ్లెవరూ లేరు, కనీసం ఇంటి వాళ్లు వీళ్ల సమాచారం తెలుసుకోవడానికైనా ఆమె దగ్గర ఫోన్ లేదు ,బయట మనుషులే కరువయ్యారు.. కనపడిన వారిని సాయం చేయమందామంటే కరోనా భయంతో అందరూ ఆమడదూరం పోయే , చేసేదేం లేక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే భిక్షాటన చేస్తూ , దాతలెవరైనా ఫూడ్ సప్లై చేస్తే అక్కడకి వెళ్లి ఫూడ్ తెచ్చి తనింత తింటూ, పిల్లలిద్దరికి పెడుతూ 17 రోజులుగా జీవనం సాగించారు. ఈ విషయం అక్కడి పోలీసులకి తెలియడంతో ఆమె దగ్గర వివరాలు తీసుకుని, ఒక ఆటో మాట్లాడి మహిళని తిరిగి వారి చుట్టాలింటికి ఖమ్మం పంపించారు.


End of Article

You may also like