Ads
ఆఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకొని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాలిబన్ ల పరిపాలన మొదలైనప్పటి నుండి అఫ్గాన్ పరిస్ధితి దారుణాతి దారుణం గా తయారైంది.
Video Advertisement
అయితే అక్కడి సామాన్య పౌరుల జీవితాలతో పాటు సెలెబ్రెటీల జీవితాలు కూడా అస్తవ్యస్తంగా మారాయి. అలా రోడ్ న పడిన ఒకప్పటి సెలబ్రిటీ అయిన ఆఫ్ఘన్ జర్నలిస్ట్ మూసా మహమ్మదీ కధ ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతుంది.
ఒకప్పుడు రిపోర్టర్ గా వివిధ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన మహమ్మదీ ఆఫ్ఘన్ లో తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీధుల్లో తిను బండారాలు అమ్ముకుంటున్నాడట. అయితే ఈ విషయాన్ని ఆఫ్ఘన్ లో మునుపటి హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పని చేసిన కబీర్ హక్మల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు మహమ్మదీని చూసి జాలి పడుతున్నారు. ఈ వార్త చూసిన నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ ‘అహ్మదుల్లా వాసిక్ ‘ మహమ్మదీ కి తన ఛానెల్ లో ఉద్యోగం ఇస్తానని ట్విటర్లొ ప్రకటించాడు.
కష్టకాలంలో ఉన్న జర్నలిస్ట్ మహమ్మదీ ని పెద్ద మనసుతో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఆహ్మదుల్లా వాసిక్ ను నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఒకప్పటి జర్నలిస్ట్ వీధి వ్యాపారి కావడం, వీధి వ్యాపారి మళ్ళీ నేషనల్ ఛానల్ లో ఉద్యోగం సంపాదించడం అంటే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదేనని, ఎవరి పరిస్ధితి ఏ క్షణం ఏ విధం గా మారుతుందో ఎవరికి తెలియదని, ఈ వార్త చూసిన నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
End of Article