Ads
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల ఆచార్య సినిమాలో నటించిన పూజా హెగ్డే, రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Video Advertisement
అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. అంతే కాకుండా తమిళంలో విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాలో కూడా నటించారు. అయితే పూజా హెగ్డే ఇటీవల చేసిన ట్వీట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అందులో పూజా హెగ్డే తనకి ఫ్లైట్ లో ఎదురైన ఒక సంఘటన గురించి రాశారు. అందులో పూజా హెగ్డే, “ఒక స్టాఫ్ నెంబర్ తనతో ప్రవర్తించిన విధానం బాగలేదు” అని చెప్పారు. “సాధారణంగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడను అని, కానీ అతని ప్రవర్తన తనకు ఇబ్బంది కలిగించింది” అని అర్థం వచ్చేలా పూజా హెగ్డే ట్వీట్ చేశారు. ఎంతో మంది నెటిజన్లు కూడా పూజా హెగ్డే కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న జనగణమన సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కొన్ని హిందీ సినిమాల్లో కూడా పూజా హెగ్డే నటిస్తున్నారు.
End of Article