Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కే. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకేకిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Video Advertisement
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో కోలీవుడ్ అగ్ర నటుడు కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికార ప్రకటన విడుదల చేశారు. ఈ మూవీలో కమల్ హాసన్ ఎంట్రీ గురించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కే. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలకపాత్రలో నటించబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దాంతో నెట్టింట్లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీలో హీరోగా ప్రభాస్ నటిస్తుండగా, కమల్ హాసన్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో విలన్ గా నటించడానికి కమల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని? కమల్ చేసే క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేశారో? విలన్ గా కమల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కమల్ ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందని సమాచారం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.సెకండ్ పార్టు సినిమా పై హైప్ పెంచడం కోసం మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కమల్ ఎంట్రీ ఉంటుందని వినిపిస్తోంది. చెప్పాలంటే ‘విక్రమ్’ మూవీలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చినట్లుగా, కమల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2024 జనవరిలో, రెండవ భాగాన్ని 2025 జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.
End of Article