Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.
Video Advertisement
అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఇప్పటికే సినిమా కథ ఒక యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ప్రభాస్ కి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు చనిపోయేముందు ప్రభాస్ ఆ స్నేహితుడితో, నేరస్తులను పట్టుకుని, వారు చేస్తున్న పనులని ఆపుతాను అని ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం కోసం ప్రభాస్ ఎలాంటి ప్లాన్ వేశారు? అసలు ఆ స్నేహితుడు ఎవరు? అతని చావుకి కారణం ఏంటి? అనే విషయాల చుట్టూ సినిమా తిరుగుతుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ ఆద్య అనే పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో శృతి హాసన్ ఒక జర్నలిస్ట్ గా కనిపిస్తారు అనే వార్త కూడా వినిపిస్తోంది. శృతి హాసన్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి అని సమాచారం. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో శ్రుతి హాసన్ పాత్రకి సాడ్ ఎండింగ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయట. అందుకోసం ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఒకవేళ నిజంగా సినిమా కథ ఇదే అయితే ప్రభాస్ కి మరొక హిట్ పడే అవకాశం ఉందేమో అని అందరూ అంటున్నారు.
End of Article