పునీత్ చివరి చిత్రం “జేమ్స్” పరిస్థితి ఏంటో తెలుసా? కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..!

పునీత్ చివరి చిత్రం “జేమ్స్” పరిస్థితి ఏంటో తెలుసా? కీలక నిర్ణయం తీసుకున్న మేకర్స్..!

by Anudeep

Ads

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

Video Advertisement

punith eyes 2

పునీత్ అకాలమరణం చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి లోను చేసింది. పునీత్ ఇప్పటికే పలు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన రెండు సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. “జేమ్స్” సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన బాడీ బిల్డర్ గా నటిస్తున్నారు. ఈ షూటింగ్ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. చాల వరకు యాక్షన్ పార్ట్ ను పూర్తి చేసేసారట.

punith 1

ప్రధాన సమస్య డబ్బింగ్ వద్దే వస్తోంది. పునీత్ ది కాకుండా మరొకరి వాయిస్ వినిపిస్తూ ఉంటె ఫ్యాన్స్ నిరాశపడతారని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో పునీత్ వాయిస్ నే వినిపించేలా చేసేందుకు చిత్ర యూనిట్ అధునాతన టెక్నాలజీని వినియోగించాలని భావిస్తోందట. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటి కంపెనీ రంగంలోకి దిగుతోంది. షూటింగ్ టైం లో పునీత్ చెప్పిన డైలాగ్స్ నే క్వాలిటీ పెంచి మూవీ కి అటాచ్ చేయాలనీ చిత్రబృందం భావిస్తోందట. 2022 మార్చి 17న పునీత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది.


End of Article

You may also like