Ads
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి. ఆ చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత రాజమౌళి తీసిన మరో అద్భుత చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆ చిత్రం దేశ విదేశాల్లో సూపర్ హిట్ టాక్ తో రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రం తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు.
Video Advertisement
అయితే బాహుబలి ఇచ్చిన బూస్ట్ తో చాలా చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల అవుతున్నాయి. ప్రభాస్ ఇప్పటికే రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్నాయి. అందుకే ఆయన ఏ సినిమా చేసినా కూడా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. తర్వాత అల్లు అర్జున్ కూడా పుష్ప 2 కు గాను వంద కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా ఈ క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 మూవీ బడ్జెట్ ఇప్పటికే అంచనాల్ని మించిపోయింది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ అదనంగా కొన్ని రోజులు తన డేట్స్ని కేటాయించాల్సి వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో RC15 కోసం రామ్ చరణ్ రూ.100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత చేయనున్న బుచ్చిబాబు చిత్రానికి కూడా 100 కోట్లు తీసుకోనున్నాడట చెర్రీ.
ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ని తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ నలుగురు తెలుగు హీరోలు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రూ.60 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వినికిడి. అయితే నెక్ట్స్ మూవీని ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు చేయబోతుండగా.. ఈ సినిమాకి సూపర్ స్టార్ కూడా రూ.100 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
End of Article