• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

రానున్న తొమ్మిది నెలల్లో 2 కోట్ల మంది జన్మించనున్నారంట..! భారత్ కి యునిసెఫ్ హెచ్చరిక!!

Published on May 26, 2020 by Anudeep

కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.. కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు లాక్ డౌన్లో సడలింపులు ప్రకటించాయి..దీంతో ప్రజలు ఎవరికి వారే అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి..ఈ పరిస్తితుల్లో గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి అనుభంద సంస్థ యునిసెఫ్ హెచ్చిరికలు జారీచేసింది..మే 10వ తేదీన జరిగిన అంతర్జాతీయ మాతృదినోత్సవం సంధర్బంగా ఒక ప్రకటణ విడుదల చేసింది.

లాక్ డౌన్ సడలించినంత మాత్రానా కరోనా ప్రభావం తగ్గిందని కాదు.. మరో ఏడాది పాటు కరోనా ప్రభావం ఉంటుందని ముందు నుండి వింటూనే ఉన్నాం.. చిన్నపిల్లలు,వయసు పైబడినవారు, రకరకాల అనారోగ్యాలతో బాధపడేవారే కరోనా మెయిన్ టార్గెట్ అనే విషయం తెలిసిందే..ఈ క్రమంలో గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే.. తాజాగా యునిసెఫ్ జారీ చేసిన ప్రకటణ ప్రకారం “ రానున్న తొమ్మిది నెలలకాలంలో భారత్ లో సుమారు 2కోట్ల మంది శిశువులు జన్మించనున్నారని,వారకి కరోనా ప్రమాదం పొంచి ఉందని వివరించింది.

గర్భిణులు, నవజాత శిశువులు కోవిడ్ -19భారిన పడే ప్రమాదం ఉంది. నవజాత శిశువుల మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో కరోనా ముప్పు ఉందని యునిసెఫ్ హెచ్చిరించింది..ఈ జాబితాలో భారత్ ప్రధమ స్థానంలో ఉందని, తర్వాత చైనా,నైజీరియా,పాకిస్తాన్, ఇండోనేషియా వరుసక్రమంలో ఉన్నాయి. తల్లినుండి బిడ్డకు కరోనా సోకుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు..కానీ గర్భిణులు తమకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి గర్భిణులు రెగ్యులర్ చెకప్స్ కి హాస్పిటల్స్ కి వెళ్లిన దాకలాలు తక్కువ..అత్యవసరం అయితే తప్ప హాస్పిటల్స్ వైపు వెళ్లట్లేదు.ఒకవైపు ఇన్ఫెక్షన్లు సోకుతాయనే భయం, మరోవైపు గర్భదారణ దగ్గర నుండి ప్రసవం, ఆ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది..వాటన్నింటిని ఎదుర్కోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఇప్పటినుండే సన్నాహాలు చేసుకోవాలని యునిసెఫ్ విజ్ణప్తి చేసింది..లాక్ డౌన్ లాంటి కార్యక్రమాల వలన ఎక్కువగా సఫర్ అయింది గర్భిణులే అని, ఇకపై అలాంటి సమస్యలు రాకుండా చూస్కోవాల్సిన బాద్యత ఆయా దేశాలపై ఉందని ప్రకటించింది.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • RRR లో “మల్లి”గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
  • “ఇలా చేస్తే నేను ఏం చేయాలి..?” అంటూ… వైరల్ అవుతున్న ఒక యువకుడి “పెళ్లిచూపుల” ట్వీట్..! నెటిజన్ల రిప్లైలు అయితే ఇంకా హైలైట్..!
  • రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!
  • నైట్ డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ కి వచ్చావ్ ఏంటి జాన్వీ అంటూ…శ్రీదేవి కూతురుపై ట్రోల్ల్స్.!
  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions