ఈ యాడ్ లో ఉన్న “రవితేజ” హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ యాడ్ లో ఉన్న “రవితేజ” హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

by kavitha

Ads

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి మిస్టర్ బచ్చన్ టైటిల్ ను  అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తోంది.

Video Advertisement

అయితే ఈ మూవీ ప్ర‌క‌టించినప్పటి నుండి రవితేజకి జంటగా సీనియ‌ర్ హీరోయిన్ల‌ను సెలెక్ట్ చేస్తున్నార‌ని, ముంబై, క‌న్న‌డ నుంచి కొత్త హీరోయిన్ తీసుకొస్తున్నారంటు ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగింది. ఫైనల్ గా ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారు. ఆమె నటించిన క్యాడ్ బరీ యాడ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న  ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో  వైరల్‌గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత  బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా  పని చేసింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read: 2023 లో ఎంట్రీ ఇచ్చిన 7 హీరోయిన్స్ .. ఎవరు హిట్టు..ఎవరు ఫట్టు.?

 


End of Article

You may also like