Ads
సుఖీభవ సుఖీభవ అంటూ ఓ షార్ట్ వీడియో తో “శరత్” అనే కుర్రాడు బాగా పాపులర్ అయ్యాడు. ఓ యాడ్ ను తీసుకుని ఆ డైలాగ్స్ తో అతను చేసిన వీడియో నెట్టింట్లో ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. రెడ్ లేబుల్ యాడ్ లో ఓ అమ్మాయి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ప్రయాణికులకు టీ ఇస్తూ ఉంటుంది. వారు తిరిగి డబ్బులు ఇవ్వబోతే తీసుకోదు.. “వద్దమ్మా.. పక్కనే టీ కొట్టు పెట్టాను.. డబ్బులు వద్దు కానీ.. మీ ఆశీర్వాదం ఇవ్వండి..” అని అడుగుతుంది.
Video Advertisement
ఓ కార్ లో ఉన్న పెద్దావిడ ఆమెని సుఖీభవ అని దీవిస్తుంది. దీనిని ఈ శరత్ అనే కుర్రాడు ఫన్నీ వీడియోలాగా చేసి వైరల్ చేసాడు. చివర్లో “సుఖీభవ.. సుఖీభవ..” అంటూ అతను చేసిన డాన్స్ చూసి నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోయారు. రెండురోజుల్లో అతని పేరు, అతని వీడియో ఎక్కడ చూసినా మారుమ్రోగిపోయింది. అయితే.. నిన్న రాత్రి అతనిపై దాడి జరిగింది. అతన్ని దారుణంగా కొట్టారు. ఎవరో హిజ్రాలపై అతను కామెంట్స్ చేయడం వల్ల.. ఆ హిజ్రాలే శరత్ ను కొట్టి ఉంటారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలు అని శరత్ స్పందించారు. తాజాగా.. ABN మీడియా తో మాట్లాడిన శరత్ తనపై దాడికి గల కారణాన్ని వివరించారు. గతం లో నా చెల్లిని వేధిస్తున్న సాయి, హరి వర్గం వ్యక్తులపై దాడి చేసానని.. ఈ కేసు విషయమై జైలు కూడా వెళ్లాలని చెప్పుకొచ్చాడు. జైలు నుంచి బయటకు రాగానే నాకు రెండు సినిమాలలో ఆఫర్స్ రావడంతోనే నా వ్యతిరేక వర్గం వారు నాపై దాడికి పాల్పడ్డారు అని శరత్ వివరించారు. ఓ వైపు శరత్ పై దాడి జరిగితే.. అందుకు కూడా అతన్ని ట్రోల్ చేస్తూ మీమ్స్ వచ్చాయి. అతనికి ఉన్నట్లుండి పాపులారిటీ రావడం వల్ల గిట్టనివారు ఇలా విమర్శిస్తున్నారు అని శరత్ పేర్కొన్నారు. కాగా.. తనపై దాడి చేసిన వ్యక్తుల గురించి శరత్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారట.
End of Article