Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘గుంటూరు కారం’. వీరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. కానీ, ఈ మూవీ మొదలుపెట్టినపప్పటి నుండి అనుకోని ఆటంకాల వల్ల వాయిదపడుతూ వస్తోంది.
Video Advertisement
ఆ మధ్యన రిలీజ్ అయిన గ్లింప్స్ తో మూవీ మళ్ళీ మొదలైందనుకునే లోపు, పోస్ట్ పోన్ అయ్యింది. దీనికి కారణం త్రివిక్రమ్ అనే టాక్ ఎక్కువగా వినిపించింది. మహేష్ మూవీని పక్కనపెట్టి, పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. అలా చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గత కొంతకాలం నుండి ‘గుంటూరు కారం’ సినిమా గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీ నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షీ చౌదరిని తీసుకున్నట్టు టాక్. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తొలగించారని, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ వార్తలు నిజమో, కాదో తెలియదు.
మరో వైపు త్రివిక్రమ్ పై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పని చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఇలా చేయడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో “మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ నా క్లాస్ మేట్. తను చెపుతుంది, పవన్ మీద ఉన్న అభిమానంతో, పవన్ కి పరోక్షంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రంకి బ్రో మీద టైం స్పెండ్ చెయ్యడానికి మహేష్ అనుమతి ఇచ్చాడంట. మహేష్-పవన్ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బలంగానే ఉంది” అంటూ రాసుకొచ్చారు.
Also Read: విజయ్ దేవరకొండ – సమంత “ఖుషీ” ట్రైలర్లో ఇవి గమనించారా..?
End of Article