Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకులను అలరించడానికి భారీ అంచనాలతో వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ మిక్సిడ్ కంటెంట్ గా రూపొందిందని తెలిసిన విషయమే.
Video Advertisement
మొదటి షో లో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నా, కొన్ని కారణాల వల్ల సర్కారు వారి పాట సినిమా కి రాను రాను ప్రేక్షకులలో నెగిటివ్ టాక్ వెలువడుతుంది. విషయానికి వెళ్తే అసలు ఏంటి ఆ నెగిటివ్ టాక్ అనేది ఇప్పుడు మనం చూద్దాం.
1. సినిమాకి నెంబర్ వన్ మైనస్ పాయింట్ ఏంటంటే సినిమా ఎడిటింగ్ అని ప్రేక్షకుల అభిప్రాయం. ఇంటర్వెల్ సీన్ కూడా చెప్పే అంత గొప్పగా లేదని ప్రేక్షకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో పోలిస్తే అంత కొత్తగా మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ లేదని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
3. దర్శకుడు మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ తో వచ్చినప్పటికీ, కంటెంట్ ని ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు
4. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో ఎంటర్టైనింగ్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం మరి సాగదీసినట్లు ఉందని, కథకు బలమైన కథనాలు ఏమీ లేవని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి
5. పరశురాం ఎక్కువగా మహేష్ బాబు మీద ఫోకస్ పెట్టడంతో, కథలో చాలా లాజిక్స్ మిస్ చేశాడని, ఇలా లాజిక్ మిస్ చేయడం వల్ల దర్శకుడు కథకు కావాల్సిన బలం చేకూర్చోలేక పోయాడని ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి.
End of Article