తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన రావటంతో… తలుపులు బద్దలు కొట్టి చూడగా కంగుతిన్నారు.!

తాళం వేసిన ఇంటి నుంచి దుర్వాసన రావటంతో… తలుపులు బద్దలు కొట్టి చూడగా కంగుతిన్నారు.!

by Anudeep

Ads

హళ్లాహళ్లి లేక్ ప్రాంతంలోని న్యూ తమిళ్ కాలనీలో ముక్కులు బద్దలైపోయే దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ముందుగా ఎలుక ఏమైనా చనిపోయి ఉండవచ్చని వెతకడం మొదలుపెట్టారు.

Video Advertisement

అప్పుడే వాళ్లలో ఒకరికి నాలుగు రోజుల క్రితం నుంచి నాగమ్మ, రూప అనే తల్లి కూతురు కనబడుటలేదు అనే విషయం గుర్తుకు వచ్చింది. సమయంలో అక్కడికి వచ్చిన వ్యక్తి నాగమ్మ ఇంటి తలుపులు బద్దలు కొట్టగా వారికీ షాకింగ్ దృశ్యం కంటపడింది.

కుళ్లిన స్థితిలో ఉన్న నాగమ్మ మరియు ఆమె కుమార్తె రూప మృతదేహాలను చూసి భయభ్రాంతులయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం  అందించారు

అసలు వివరాల్లోకి వెళ్తే నాగమ్మ, రూప గత కొన్ని సంవత్సరాలుగా న్యూ తమిళ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రూప హోంగార్డుగా విధులు నిర్వహించేదని అయితే కొన్ని కారణాల వల్ల కొద్ది నెలల క్రితం హోంగార్డ్ విధుల నుంచి సస్పెండ్ అయ్యిందని పోలీసులు తెలియజేశారు.

రూపకి పదేళ్ల క్రితమే పెళ్లి అయినా కుటుంబ సమస్యల కారణంగా ఆమె భర్తకు పిల్లలకు దూరంగా ఉంటుందని, అప్పటినుంచి తల్లితో కలిసి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. తరచూ ఇద్దరి మధ్య ఏదో ఒక కారణంతో గొడవ జరుగుతుందని, గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తల్లి, కుమార్తెలు ఇద్దరు మద్యానికి బానిస అయ్యారు అని స్థానికులు పోలీసుల విచారణలో తెలియజేశారు.

నాగమ్మ మరియు ఇద్దరి మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరి మరణానికి గల కారణాలేమిటో అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టమవుతుందని పోలీసులు తెలియజేశారు.

 

 


End of Article

You may also like