Ads
ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.
Video Advertisement
వీరిద్దరూ విడాకులు తీసుకున్న తరువాత స్పందించిన నాగ చైతన్య.. విడిపోయాక కూడా మేమిద్దరం హ్యాపీ గానే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు సమంత కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె వరుస పెట్టి టూర్స్ వేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇక.. తనకు ఎంతో ఇష్టమైన పెట్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చెప్తూ ఉంటారు. ఆ పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల తన పెట్స్ తో కలిసి దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే.. ఈ ఫోటోలపై ఓ నెటిజెన్ వింతగా కామెంట్ పెట్టారు. ఆ పెట్స్ తో సమంత ఒంటరిగా చనిపోవాలి అంటూ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్ కు స్పందించిన సమంత.. అలా చనిపోతే, అదృష్టవంతురాలిగా భావిస్తా అని రిప్లై ఇచ్చింది. దీనితో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తిని తిడుతున్నారు. మరోవైపు సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
End of Article