Ads
కరోనా మహమ్మారి వచ్చిన తరువాత మన లైఫ్ స్టయిల్ దాదాపు గా మారిపోయింది. అంతే కాదు.. మన షాపింగ్ అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ఒకప్పుడు జంక్ ఫుడ్ ను అతిగా తినే జనం ప్రస్తుతం వాటిని బాగా తగ్గించేశారు. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ పైనే ఎక్కువ గా దృష్టి పెడుతున్నారు. పాలు, పెరుగు, వంటి పదార్ధాలపైన గతం లో కంటే ఎక్కువ గా ఖర్చు చేస్తున్నారట.
Video Advertisement
అలాగే.. ఫ్యాన్సీ డ్రెస్ లు, కాస్మొటిక్స్ పైన గతం లో జోరు గా వ్యాపారం సాగేది. కానీ, ప్రస్తుతం వీటి కంటే గ్రోసరీస్ పైనా.. హెల్ది ఫుడ్ పైన ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. కాస్మొటిక్స్ పైన ఐతే దాదాపు తగ్గించేసారట. చాలా మంది ఇంటికే పరిమితం అయిపోతున్నారు. గడప దాటి వెళ్లాల్సిన అవసరం లేకపోవడం తో.. వీటి ఖర్చు కూడా ఉండడం లేదు. షాపింగ్ మాల్స్ లో కంటే.. కిరానా కోట్లలో సరుకులు కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారట. మాల్స్ లో రద్దీ ఉండడం.. కరోనా సోకే ప్రమాదం ఉండడం తో కిరానా షాప్ లోనే సరుకులు తెచ్చేసుకుంటున్నారట. అయితే.. మద్యం అమ్మకాలు మాత్రం గతం లో కంటే పెరిగాయి. భారత్ లో గతం తో పోలిస్తే మద్యం వినియోగం 29 శాతం పెరిగింది. ప్రపంచ సగటు మద్యపానం 25 శాతం పెరిగింది.
End of Article