“నా కొడుకు బ్రేకప్ చెప్పలేదు.. వాళ్ళు కలుస్తారు..” అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన షన్ను ఫాదర్..!

“నా కొడుకు బ్రేకప్ చెప్పలేదు.. వాళ్ళు కలుస్తారు..” అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన షన్ను ఫాదర్..!

by Anudeep

దీప్తి, షన్ను బ్రేక్ అప్ చెప్పుకున్నారు అంటూ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేసాయి. ఈ టైంలో వారు పెట్టిన ట్వీట్స్ కూడా చాలానే వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ రోజే.. ఈ కొత్త జంట తమ దారులు వేరు అంటూ స్పష్టం చేసింది.

Video Advertisement

ఇది ఇలా ఉంటే షన్ను కూడా తనకి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది అని అన్నాడు. అలానే ఇప్పటి వరకు ఆమె చాలా చేసిందని, ఇప్పుడు ఆమె ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని షన్ను చెప్పిన విషయమూ తెలిసినదే.

deepthi-shannu 1

వీరిద్దరూ విడిపోయి ఇప్పటికి వారం పైనే అవుతోంది. అయినప్పటికీ వీరి అభిమానులు వీరిద్దరూ కలిసి ఉంటె బాగుంటుంది అని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో షణ్ముఖ్ తండ్రి చెప్పిన మాటలు దీప్తి-షన్ను ల ఫ్యాన్స్ కి ఊరట కలిగించేలా ఉన్నాయి. దీప్తి మాత్రమే బ్రేక్-అప్ చెప్పిందని, నా కొడుకు షన్ను ఎక్కడా చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు.

deepthi-shannu 2

ఇటీవల ఓ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. “దీప్తి నే బ్రేక్ అప్ చెప్పింది.. నా కొడుకు ఎక్కడా చెప్పలేదు కదా.. వారిద్దరూ కలిసే ఉంటారు. వారిద్దరి వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చించకూడదు… ఆ అమ్మాయికి ఏం అనిపించిందో.. సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ పెట్టింది.. వాళ్ళు కలవడానికి కొంత సమయం పడుతుందేమో.. వాళ్ళు కలిసే ఉంటారు.. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయమని..అంతా శుభమే జరుగుతుంది.. అభిమానులు ఈ విషయంలో అనుమానించక్కర్లేదు ..” అంటూ స్పష్టం చేసారు.


You may also like