Ads
వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక సామెత ఉండనే ఉంది. అందుకు తగ్గట్లే కొందరు ఉంటూ ఉంటారు. ఇటీవల శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే అమ్మాయి.. తాను చనిపోతే తన చుట్టూ ఉండేవారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలని కోరిక కలిగిందట. అనుకున్నదే తడవు గా అందుకు ఏర్పాట్లు కూడా చేసేసుకుంది. ఒక లగ్జరీ శవపేటికను తెప్పించుకుందట. తెల్లని గౌన్, కిరీటం, పూలు ఇలా అన్ని పెట్టుకుని శవపేటికలో పడుకుని.. ముక్కులో దూది పెట్టుకుని ఉందట. దాదాపు మూడు గంటల పాటు ఆమె అలానే నటించిందట.
Video Advertisement
ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించడం మరీ విడ్డురం. ఆమె పడుకోగానే.. ఆమె కుటుంబ సభ్యులు నకిలీ ఏడుపులు మొదలెట్టేసి.. అందరిని నమ్మించారట. ఈ మొత్తం తతంగం కోసం ఆమె 710 యూరోలు ఖర్చు చేసిందట. ఈమె స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో ఆమెను విమర్శిస్తున్నారు.
End of Article