Ads
హీరో నాని వరుస సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకి నాని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది.
Video Advertisement
నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో కూడా ఈ చిత్రం విడుదల అయ్యింది. ఇటీవల ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యి ప్రేక్షకుల మన్ననను పొందుతోంది. అయితే.. థియేటర్ లో విడుదల అయిన వెర్షన్ లో లేని సీన్స్ కూడా ఓటిటిలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాలో చిన్న చిన్న విషయాలపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో సిరివెన్నెల పాట ఒకటి అందరి మన్ననలు పొందుతోంది. ఇది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల గారి చివరి పాట అన్న సంగతి తెలిసిందే. ఈ పాటని సినిమాలో లేదా వీడియో లో చూస్తున్నపుడు ఒకటి గమనించవచ్చు. ఈ పాటలో సాయి పల్లవి, నాని ఒకరినొకరు చూసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ గమనిస్తే.. సాయి పల్లవి వెనుక ఉన్న అమ్మాయి కూడా నాని వైపు చూస్తూ ఉంటుంది.
మరో వైపు నాని వెనుక మరొక అతను కూడా సాయి పల్లవి వైపు చూస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. దీనితో అసలు సందేహం మొదలవుతోంది. నాని, సాయి పల్లవి ఎవరెవరెవరి వైపు చూస్తున్నారు అన్న సందేహం కలుగక మానదు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కధకి ఇవి ఎలాంటి ఆటంకం కలిగించవు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సాయి పల్లవి, నాని హీరో-హీరోయిన్లు కాబట్టి.. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారని అనుకోవాలి.
Watch Video:
End of Article