“పెదన్నయ్య చాలా ఇబ్బంది పెట్టాడు..!” హీరోయిన్ “స్నేహ” కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..!

“పెదన్నయ్య చాలా ఇబ్బంది పెట్టాడు..!” హీరోయిన్ “స్నేహ” కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..!

by kavitha

Ads

హీరోయిన్ స్నేహ తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ సౌందర్య మరణం తరువాత ఆమె స్థానాన్ని కొంత వరకు భర్తీ చేసిన హీరోయిన్ స్నేహ. ఆమె తెలుగులో స్టార్ హీరోల చిత్రాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకున్నారు

Video Advertisement

స్నేహ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అలాగే తాను చిన్నతనంలో తాను అనుభవించిన బాధల గురించి చెప్పుకొచ్చారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తొలివలపు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్నేహ, ఆ తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, శ్రీరామదాసు, సన్నాఫ్ సత్యమూర్తి వంటి ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికీ స్నేహకు ఆడియెన్స్ లో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో కొనసాగుతూ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి స్నేహ మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు. కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని  కోరుకుందని తెలిపింది. కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు వాటిని తామే ఇవ్వాల్సి వచ్చేదని, అదేం పద్దతి అని అడిగితే మేము మగవాళ్ళం అని, ఆడపిల్లలు కాబట్టి ఇంటి పనులు మీరే చేయాలని చెప్పేవారని అన్నారు. తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.

Also Read: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా ఏమిటో తెలుసా?


End of Article

You may also like