Ads
కొన్ని సంఘటనలు చూస్తుంటే.. రాబోయే తరం ఎటువంటి భవిష్యత్ తయారు చేస్తుందో అన్న భయం కలగకమానదు. నిన్నటి తరాలతో పోలిస్తే..నేటి తరానికి అన్ని అరచేతిలోనే దొరికేస్తున్నాయి. వారు ఏమి చూస్తున్నారో.. ఏమి నేర్చుకుంటున్నారో.. ఓ కంట కనిపెట్టకపోతే ఇబ్బందులు తప్పవు.
Video Advertisement
తాజాగా.. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే పిల్లల పెంపకం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్న సంగతి బోధపడుతుంది.
వివరాల్లోకి వెళితే, తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన విజయ్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేసేవాడు. కొద్దీ రోజుల క్రితమే.. అతని తల్లి మృతి చెందింది. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మరణించడంతో విజయ్ దిగ్బ్రాంతికి లోనయ్యాడు. ఆమెను తలుచుకుని రోజు కుమిలిపోతూ ఉండేవాడు. అతని బాధని చూడలేక.. అతని సవతి తల్లి కొన్నిరోజుల పాటు ఇంట్లో ఉండమని తమ ఇంటికి తీసుకెళ్లింది. ఆమెకు మరో 15 సంవత్సరాల కూతురు ఉంది.
ఆమె తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. వారింట్లో ఉంటున్న విజయ్ కన్ను ఆ పాపపై పడింది. ఓ రోజు స్కూల్ దగ్గర దింపుతాను అంటూ ఆమెను బండి ఎక్కించుకున్నాడు. అన్నయ్యే కదా అనుకుని ఆ పిల్ల బండి ఎక్కింది. కానీ, విజయ్ ఆమెను ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఎవరికైనా ఈ విషయం గురించి చెబితే చంపేస్తానని బెదిరించాడు. తిరిగి ఆమెను ఇంటిదగ్గర దింపేసాడు. ఆమె దిగులుగా ఉండడం చూసి తల్లి అడగడంతో.. ఆ బాలిక ఏడుస్తూ అసలు విషయం చెప్పేసింది. దీనితో షాక్ అయిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద విజయ్ ను రిమాండ్ కు తరలించారు.
End of Article