కరోనా మహమ్మారిని పూర్తి గా ఎదుర్కోకముందే.. వరుస వైరస్ లు దాడి ప్రారంభించాయి. ఈ మహమ్మారి ని ఎదుర్కొనడానికి వాడుతున్న స్టెరాయిడ్స్, వెంటిలేటర్ల మూలం గా ఈ వైరస్ లు కరోనా రోగుల్లో ఏర్పడి.. అవి అందరికి వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు పలు చోట్ల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసు లు కనబడగా.. తాజాగా ఎల్లో ఫంగస్ కేసు కూడా బయటపడింది.

మొట్టమొదటి యెల్లో ఫంగస్ కేసు ఘజియాబాద్ లో నమోదు అయింది. వైట్ మరియు బ్లాక్ ఫంగస్ ల కంటే యెల్లో ఫంగస్ మరింత ప్రమాదకారి అని తెలుస్తోంది. యెల్లో ఫంగస్ సోకిన వ్యక్తి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఆకలి వేయకపోవడం, నీరసం, తక్కువ ఆకలి, బరువు తగ్గిపోవడం వంటివి. చాలా సార్లు దీని మూలం గా చీము పట్టడం, గాయాలు తొందరగా మానకపోవడం వంటివి జరుగుతాయి.
