అక్కినేని ఫ్యామిలీ గురించి తెలియని వారు ఉండరు. అందులో ముఖ్యంగా అక్కినేని అమల అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.
ఆమె సినిమాల్లో చూపించిన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక “హలో గురూ ప్రేమ కోసమే రా ఈ జీవితం” అంటూ ఆమె చేసిన డాన్స్ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది అంటే అతిశయోక్తి లేదు.
అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.
ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.

నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున భార్య అమల కూడా మొదట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై పోయింది. అమల నాగార్జున కు రెండవ భార్య.
ఆయన అంతకు ముందే లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టారు.. తర్వాత నాగార్జున అమల ని పెళ్లి చేసుకుంటే అఖిల్ పుట్టాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తో పాటుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్,నాగచైతన్య స్టార్ హీరో పేరు సంపాదించుకోలేక పోతున్నారు. నాగ చైతన్య దానికి దగ్గరలో ఉన్నా ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగారని, అప్పుడప్పుడు తండ్రి వద్దకు వచ్చి సమయాన్ని గడిపే వాడని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య సెలవుల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చే వాడిని, తను నాగచైతన్యని పెంచలేదని. అతను మొత్తం చెన్నైలో పెరిగాడని చెప్పుకొచ్చింది.
వాళ్ళ అమ్మ చైతన్యను చాలా పద్ధతిగా పెంచిందని, రెండు మూడు నెలలకు ఒకసారి చైతన్య హైదరాబాద్ వచ్చి తన తండ్రితో గడిపేవాడిని ముచ్చటించింది. చైతన్య వచ్చినప్పుడు అఖిల్ తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే వాడని, చైతన్య ఇక్కడికి వస్తే అఖిల్ నన్ను కూడా మర్చి పోయేవాడని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకొనే వారని తెలియజేసింది. వీరిద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసే వాడని, చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవారని తెలియజేసింది అమల.