పిఆర్ టీం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట. అసలు పిఆర్ టీం అంటే ఏంటి.. పిఆర్ టీమ్స్ బిగ్ బాస్ షో కీ పని చేశాయా.. అవి లేకుంటే హౌస్ లో ఉండటం చాలా కష్టమేనా..?
కామన్ గా అయితే సినిమా ప్రమోషన్స్ కు పిఆర్ టీమ్ లను పెట్టుకుంటారు. సినిమా విడుదలైంది మొదలు థియేటర్స్ లో బొమ్మ పడే వరకు ఆ మూవీపై ఎక్కడ కూడా నెగిటివ్ టాక్స్ రాకుండా ప్రమోట్ చేయడం వీరి బాధ్యత.
అందుకోసమే నిర్మాణ సంస్థల వారి నుంచి ప్యాకేజీలు మాట్లాడుకొని సినిమాకు హైప్ తీసుకు వస్తూ ఉంటారు. వారికి ఎన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తే సినిమాకు అంత ప్రమోషన్ ఉంటుందన్నమాట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అదరగొడతారు. అయితే ఈ వ్యవస్థ సినిమా నుంచి బిగ్ బాస్ వరకు విస్తరించి పోయింది. ఎంతగా అంటే బిగ్ బాస్ షోలో ముందుకు రావాలి అంటే ఈ టీమ్ వుండాల్సింది అన్నట్టుగా తయారైంది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఈ టీంల ప్రభావం ఎక్కువగా లేదు. సెకండ్ సీజన్ లో మాత్రం కౌశల్ విన్నర్ కావడానికి పిఆర్ టీం కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా సీజన్ సీజన్ కు పిఆర్ టీమ్స్ విస్తరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారని, ఈ సీజన్ లో అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, అఖిల్, స్రవంతి, శివ, హమీద ఇలా చాలా మంది ఈ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ టీమ్ వారు వాళ్ల యొక్క సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేస్తూ.. ప్రమోషన్స్ కు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఓట్లు వేయించడంలో ముందుంటారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా.. మిత్రశర్మ టాప్ 5కీ వచ్చిన అది ఈ టీమ్ వల్లే అని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బిందు పేక్ ఓటింగ్ వేయించుకుందని, ఆమె కోసం పిఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని వాళ్లు ఫేక్ ఓటింగ్ ద్వారా బిందుకు ఓట్లు పడేటట్లు చేశారని ఆరోపించారు. దీనిపై బిందు స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తప్ప ఎలాంటి టీమ్లను వాడుకో లేదని, అలాంటిది మాకు ఏమి అవసరం లేదని , ఏపీ,కర్ణాటక,తెలంగాణ, చెన్నై ప్రాంతాలనుంచి ఓట్లు పడడం వల్లనే విన్నర్ అయ్యానని తెలియజేసింది. నిజానికి పీఆర్ టీమ్స్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అని అన్నది.

ఈ తరుణంలో ఆమె తండ్రి స్పందించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బిందు ఇంజనీరింగ్ చేసేటప్పుడే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశామని ఆయన అన్నారు. అప్పట్లోనే మంచి మంచి సంబంధాలు వచ్చాయని, ఐ ఆర్ ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్, ఐపీఎస్ లాంటి సంబంధాలు వచ్చాయని దీంతో ఒక తండ్రిగా నేను ఆమెపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. కానీ వివాహంకు ఆమె విముఖత చెప్పిందని దీంతో నేను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు.
ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను అని కానీ బిందు ఒప్పుకోలేదని తెలియజేశారు. నేను చిన్న పిల్లని కాదని నా మంచి చెడ్డలను నేను చూసుకోగలనని సమాధానం ఇచ్చిందని అన్నారు. అప్పటినుంచి బిందు వివాహం విషయం ఆమెకి వదిలేశారని, ప్రస్తుతం కాలం మారిందని పిల్లల ఆకాంక్షలు, అభిరుచులను వారికే వదిలేయాలని తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో చూస్తూ నడుచుకోవాలని చెప్పారు.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.
వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.
మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.