మనం ప్రతి రోజూ మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగానే తెలిసి తెలియక అనేక పొరపాట్లు కూడా చేస్తాం. ఈ విధంగా చేసే తప్పులే చివరికి అనేక సమస్యలకు దారి తీస్తాయి. కానీ ఇలాంటి విషయాలను కొందరు నమ్ముతారు మరి కొందరు నమ్మరు.
మరి వీటిని పాటించాలా లేదా అనేది మాత్రం వారి యొక్క వ్యక్తిగత విషయం. పూర్వీకుల నుండి మన ఇంట్లో కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. దాని ప్రకారమే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటో చూద్దాం.ప్రతిరోజు మనం నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా దుప్పటిని మడిచి పెట్టాలి.

లేదంటే దరిద్ర దేవత కొలువుదీరి ఉంటుంది. అలాగే చాలామంది పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి వాకిలి చల్లుకుంటారు. దీనివల్ల కూడా దరిద్రం చుట్టుకుంటుంది. ఇంకొంతమంది తినడం అయిపోయిన తర్వాత కూడా ఎంగిలి కంచం ముందు కూర్చొని ఉంటారు. అలా ఎప్పుడూ కూడా కూర్చోకూడదు. పూజ గదిలో ఓకే దేవుడికి చెందినటువంటి రెండు ఫోటోలు కూడా ఉండకూడదు. అలాగే ఏవైనా విగ్రహాలు ఉంటే మాత్రం తక్కువ ఎత్తులో ఉండాలి. మనం పూజ చేసే టైంలో దేవుడి ముందు ఖచ్చితంగా నీటిని పెట్టాలి.

అలాగే పూజ గదిలో ఒక్క ప్రమిద పెట్టేవారు మూడు వత్తులు వేయాలి. లేదంటే అంతకంటే ఎక్కువ ప్రమిదలు వెలిగించే వారైతే రెండు వత్తులను వేసి దీపారాధన చేయాలి. దీపారాధనకు సంబంధించి మన స్తోమతకు తగ్గ నూనెను ఉపయోగించవచ్చు. కానీ ఏదైనా ప్రత్యేక పూజలు చేసే సమయంలో మాత్రం దీపారాధనకు వాడే నూనె మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా ఆవునెయ్యి, నువ్వుల నూనె వంటివాటితో పూజ చేయాలి. అలాగే సాయంత్రం ఆరు దాటింది అంటే కోడిగుడ్లు, ఉప్పు, సూది, నూనె ఇంట్లోకి తేకూడదు . ఇవి శని స్థానాలు కనుక వాటిని ఆ సమయంలో ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి శని తెచ్చుకున్నట్టే. అందుకే పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: వినాయక చవితి ఉత్సవాల్లో గణపతి బప్పా “మోరియా” అని ఎందుకు అంటారు..?

ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రెండు రకాల గుడ్లు ఉన్నాయి.. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది.. మరి ఆ గుడ్లు ఏమిటి.. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం..?
ఈ గుడ్డులో తెల్ల గుడ్డు కన్నా బ్రౌన్ రంగులో ఉండే గుడ్డు మంచిది. ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా ఈ కోళ్లను పెంచుతారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోధుమ గుడ్డు అమ్మే వ్యక్తులు తెల్ల గుడ్డు కన్నా గోదుమ రంగు గుడ్డు చాలా ఆరోగ్యకరం అని చెబుతూ మార్కెటింగ్ చేస్తున్నారు.
ఈ విధంగా గోధుమ రంగు గుడ్లను ధర పెంచి అమ్మడం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.. వాస్తవంగా చూసుకుంటే తెల్ల గుడ్డు అయినా గోధుమరంగు గుడ్డు అయినా రెండు గుడ్లే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రంగులను అడ్డంపెట్టుకుని గుడ్లలో తేడా చూపించి దందా సాగిస్తున్నారు.
ఇందులో పోషకాల విషయానికి వస్తే గోధుమ మరియు తెలుపు గుడ్ల మధ్య తేడా ఏమీ ఉండదు. గోధుమ రంగు గుడ్లను మన దేశంలో ఉన్నటువంటి నాటు కోళ్లు మాత్రమే పెడతాయి. రంగులో తేడా ఉన్నా ఆ గుడ్లలో ఉండే పోషక విలువలు మాత్రం ఒక్కటేనని నిపుణులు అంటున్నారు.