కన్నడ సినిమా కాంతార బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా విజయవంతంగా దూసుకుపోతుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహించని కలెక్షన్స్ రాబడుతుంది.
కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డ్ నమోదు చేసింది. 50రోజులు దాటిన కూడా థియేటర్లలో సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా తాజాగా కేజీఎఫ్ 2 రికార్డ్ ను బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఇతర భాషా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో వాటిలో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి విడుదలైన అన్ని భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంది.
కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.

కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’లో రాజుగారి ఆస్థానంలో ఉండే ప్రసిద్ద నర్తకి పాత్రలో కనిపించనుంది. కంగనా రనౌత్ కు జంటగా తమిళ నటుడు రాఘవ లారెన్స్ నటించనున్నారు. ఇక ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేయనున్నారు. కంగనా ఈ పాత్రను చేయనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో మొదలవుతుందని సమాచారం.
కంగనా రనౌత్ ఈ షెడ్యూల్ లో పాల్గొననుందని తెలుస్తోంది. కంగనా దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ‘ఎమర్జెన్సీ’ తరువాత షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అది ముగిసిన తర్వాత ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన లైకా నిర్మిస్తోంది. ఇక కంగనా రనౌత్ ‘తేజస్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషిస్తుంది. ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ ‘నోటి బినోదిని’ కూడా ఉంది.
అయితే రిషబ్ శెట్టి తాజాగా విడుదలైన కాంతారాతో స్టార్డమ్లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్ల నుంచి రివ్యూల వరకు ప్రతి విషయంలోనూ సినిమా అద్భుతంగా రాణించింది. ఇక రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మీద అసహనం వ్యక్తం చేశాడు. ఆమెతో పని చేయడానికి ఆసక్తి లేదనట్టుగా మాట్లాడాడు. రష్మిక గతంలో తన ఫస్ట్ సినిమా హౌస్ పేరు చెప్పకుండా చూపించిన సైగలను ఇమిటేట్ చేసి,తన వేళ్లను చూపించి ‘ఇస్ టైప్ కే యాక్ట్రెస్’ అన్నాడు.
ఇక దీనిపై తాజాగా రిషబ్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి ఒక యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ, రష్మిక తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమెకు కూడా సినిమా అంటే ఇష్టం. సినిమా చూడకుంటే ఫర్వాలేదు, తన సినిమాలతో బిజీ అయి ఉండవచ్చు. ఆమెకు ఆమె స్పేస్ ఇవ్వండి. ఎక్కడ జీవితం మొదలు పెట్టమో, అక్కడే ఉండిపోవాలని లేదు. ఉన్నత స్థానాలకు ఎదగాలి. రష్మిక ప్రస్తుతం అదే చేస్తుంది అని ప్రమోద్ అన్నాడు.
ప్రమోద్ చివరగా రష్మికకు, రష్మిక పై కామెంట్ చేసేవాళ్లకు ఒక మాట చెప్పాడు.కెరీర్లో మొదటి విజయాన్ని ఇచ్చిన వాళ్లను మరచిపోకూడదు. వాళ్ళను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేయకూడదు. ఎదుగుతున్న వారిని కూడా విమర్శించకూడదని, ఒకవేళ అలా చేస్తే చిన్న పిల్లలు అవుతాము అంటూ ప్రమోద్ స్పందించాడు. మరి ఇప్పటికైనా ఈ చర్చ ఇక్కడితో ఆగుతుందో చూడాలి.
ఇప్పటికే మహేష్బాబు,త్రివిక్రమ్ల సినిమా పై రకరకాలుగా రూమర్స్ షికారు చేస్తున్నాయి. అసలు ఈ సినిమానే ఆగిపోయిందని కూడా టాక్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ కథలో మార్పులు చేయమని త్రివిక్రమ్ కి సూచించారని,దాంతో ఈ సినిమా స్టోరీ పూర్తిగా మారిపోయిందని కూడా వచ్చాయి. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.
ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్లో మొదలు కానుంది. షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరగనుందని సమాచారం. పూజా హెగ్డే కాలి గాయం నుంచి కోలుకుని ఈ షూటింగ్ లో పాల్గోబోతుందని చెప్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ఇంకో హీరోయిన్కు స్థానం ఉందని సమాచారం. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్బాబు తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదలు అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరి మహేష్ బాబు ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ పాల్గొంటాడా లేదా త్రివిక్రమ్ మూవీ తర్వాతనే రాజమౌళి సినిమా మొదలు పెడతాడా అన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇంతకు ముందు అతడు, ఖలేజా చిత్రాలు చేశాడు. మూడో సినిమాలో మహేష్ బాబుని ఎలా త్రివిక్రమ్ చూపిస్తున్నాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.
డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబీ29 గురించి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు. “మహేష్ తో తీయబోయే సినిమా ఇండియానా జోన్స్లాంటి ఓ అడ్వెంచరస్ మూవీ అని, ఇలాంటి మూవీ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇదే దానికి సరైన టైమ్ అనిపించింది. ఈ సినిమాకి మహేష్ బాబునే పర్ఫెక్ట్ ఛాయిస్. ఇలాంటి సబ్జెక్ట్కు అతను సూటవుతాడు.ఇది ప్రపంచమంతా చుట్టే ఒక అడ్వెంచరస్ సినిమా అని రాజమౌళి చెప్పాడు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నాడు.
గతంలోనే విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథను రాయబోతునట్లు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి కూడా అదే కథని చెప్పాడు. యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్స్ అన్ని ఎస్ఎస్ఎంబీ29 లో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ 2023లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ మూవీలో నటించబోయే నటీనటుల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్స్లోకి తీసుకెళ్ళే పనుల్లో ఉన్నాడు. అవన్నీ పూర్తయితే కానీ ఎస్ఎస్ఎంబీ29 పై దృష్టి పెట్టే అవకాశాలు లేవు.
హీరో ధనుష్ కు పక్కాగా సెట్ అయ్యే కథ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుంటారని, వీరిని ఫైనల్ చేయాల్సి వుంది. ఇక శేఖర్ కమ్ముల స్టైల్ ఎమోషన్లు కూడా చాలా వుంటాయని తెలుస్తోంది. సినిమాలో ధనుష్ పాత్ర కాకుండా మరో ముఖ్య పాత్ర ఉంతుందని సమాచారం. ఎమోషనల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. రామ్ మోహన్ రావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ మూవీలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు ఎదురుచూడాలి.
దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ పనులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారని, శేఖర్ కమ్ముల పారితోషికం భారీగా పెరిగిందని సమాచారం. అయితే 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని అంటున్నారు. హీరో ధనుష్ నటించే ఒక్కో సినిమాకు ముప్పై నుండి నలబై కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా.
‘పుష్ప’ సినిమాను సెప్టెంబర్లో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రష్యన్ సబ్టైటిల్స్తో ప్రదర్శించారు. నిర్మాతలు ఈ వేదిక మీదే ఈ మూవీని రష్యన్ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 8న ‘పుష్ప’ సినిమాని రష్యాలో విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. పోస్టర్ను కూడా విడుదల చేసి, రష్యన్ భాషలో ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మాస్కోలో డిసెంబర్ 1న,సెయింట్ పీటర్స్బర్గ్లో 3న ప్రీమియర్స్ వేయనున్నారు.
అంతేకాకుండా పుష్ప మూవీ యూనిట్ కూడా అక్కడి ఆడియెన్స్ ని పలకరించనున్నారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప 2’ మూవీ షూటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తొలి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని హంగులతో పుష్ప కంటే బాగా రెడీ చేయడానికి సుకుమార్ బృందం కస్టపడుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
చిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు.
ఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని, దానికి ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్ పని చేయలేదు.
అయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.