ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతీ ఒక్కరికి ఆసక్తి ఉంటుంది.ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ, సౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. భరోసాను కల్పిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగాలు రావడమే ఆరాడు ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ నటన పై ఉన్న ఇష్టంతో తమ కెరీర్ను పణంగా పెట్టి, సినీ పరిశ్రమకు వచ్చి, ఎన్నో ఇబ్బందులు దాటుకుని పెద్ద స్టార్లుగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖుల గురించి తెలుసుకుందాం. మరి వారు ఎవరో చూద్దాం..
1.రజనీకాంత్
బాలీవుడ్లో కూడా పనిచేసిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా పనిచేశారు. అతను నటుడిగా మారడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నేడు అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. అతనికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు మరియు ప్రజలు అతన్ని తలైవా అని ప్రేమగా పిలుస్తారు.
2.దిలీప్ కుమార్
హిందీ సినీ పరిశ్రమ చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో దిలీప్ కుమార్ ఒకరు.దివంగత నటుడు దిలీప్ కుమార్ ఔంద్ పూణేలో మిలటరీ క్యాంటీన్ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి బాలీవుడ్ సినిమా ఆఫర్ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు.
3.దేవ్ ఆనంద్
బాలీవుడ్లోకి రాకముందు దేవ్ ఆనంద్ సెన్సార్ బోర్డ్ క్లర్క్గా పనిచేశాడు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎనలేనివి.
4.రాజ్ కుమార్
40వ దశకం చివరిలో రాజ్ కుమార్ ముంబైకి వెళ్ళి అక్కడ ముంబై పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. బాలీవుడ్లో కెరీర్ను కొనసాగించేందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు.
5.జానీ వాకర్
బాలీవుడ్ లో పాత తరము గొప్ప హాస్య నటుడు జానీ వాకర్.సినిమాల్లోకి రాకముందు జానీ వాకర్ ముంబైలో బస్ కండక్టర్ గా పని చేసేవాడు.
6.బాల్రాజ్ సాహ్ని
బాల్రాజ్ సాహ్ని ప్రముఖ నటుడు. నటుడిగా మారక ముందు బెంగాల్లోని శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేశారు. అతని భార్య కూడా అదే సంస్థలో బోధించింది.
7.అమోల్ పాలేకర్
అమోల్ పాలేకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు.అయితే ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్ లో కెరీర్లో కొనసాగించాడు.
8.అమ్రిష్ పూరి
సినీ పరిశ్రమలో విశిష్ట నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అమ్రిష్ పూరి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కానీ నటించాలనే కలను నెరవేర్చుకోవడం కోసం హీరోగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అయితే అమ్రిష్ పూరి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించాడు. మిస్టర్ ఇండియాలోని ఆయన చేసిన మొగాంబ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
9.శివాజీ సతమ్
ACP ప్రద్యుమన్ పాత్రలో పాపులర్ అయిన శివాజీ సతమ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవారు. కానీ కానీ అతను నటన పై ఉన్న ఆసక్తితో థియేటర్లో చేరి నటుడిగా మారాడు.


ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. సౌందర్య ఈ మూవీలో హీరోయిన్ పాత్ర లో నటించగా రమ్యకృష్ణ మాత్రం నెగిటివ్ రోల్ చేసింది. ఆనాడు రమ్యకృష్ణకు మంచి నటిగా మరింత పేరు తెచ్చిన పాత్రల్లో ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో సౌందర్య ముఖంపై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్ ఉంటుంది.
రమ్యకృష్ణ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి నుండి తెలుసని రవికుమార్ చెప్పుకొచ్చారు. అయితే రమ్యకృష్ణ, సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయాలని చెప్పగానే రమ్యకృష్ణ మాత్రం ఆ సీన్ చేయనని రవి కుమార్ కు చెప్పరట. అయితే సౌందర్య మార్కెట్ ఎక్కువ అని నా మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పారట. కానీ సౌందర్య మాత్రం నువ్వే చెయ్యాలి.
అంటూ ఆమె కాళ్లు తన ముఖం పై పెట్టుకున్నారని కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు. కానీ రమ్య కృష్ణ ఆ సమయంలో ఏడ్చారని కామెంట్ చేశారు. ఆ షాట్ రియల్ అని కె.ఎస్.రవికుమార్ తెలియజేశారు. అందులో రమ్యకృష్ణ సౌందర్య నటించారని డుప్ ఏమీ లేదని రవికుమార్ అన్నారు. ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ సినీ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఆయన అన్నారు.
కానీ కానిస్టేబుల్స్ అతన్ని కాల్చేయమంటే కాల్చరు. మీలాంటి మంచి వాళ్ళు బతకాలి అంటారు. అయితే ఈ సీన్ చూస్తే శివాజీ సినిమాలో రజినీకాంత్ జైల్లో పడ్డప్పుడు ఆయన్ని కొట్టమంటే కానిస్టేబుల్ కొట్టడు.. లేదండి నేను కొట్టను ఆయన నా బ్రదర్ చదువుకి హెల్ప్ చేశాడు అంటూ చెబుతాడు.. అంటే ఈ డైలాగ్ సర్కారు వారి పాట లోని డైలాగ్ ఒకే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి.