సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ సంతాప సభ, చిన్న కర్మ కార్యక్రమాల్లో రమేష్ బాబు భార్య, పిల్లలు హాజరయ్యారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు, నమ్రత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మహేష్ బాబు కుటుంబంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంవత్సరం మొదట్లోనే మహేష్ అన్నయ్య, కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు. సెప్టెంబర్లో కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిలా దేవి మరణించగా, నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. మూడవ రోజు ఘట్టమనేని కుటుంబం హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.

ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.