బాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం తమిళ, తెలుగు భాషల్లో కూడా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వెండితెరపై తళుక్కుమనే సెలెబ్రిటీలు బుల్లితెరపై కనిపించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాని బుల్లితెరపైకి తీసుకొచ్చిన “మాస్టర్ చెఫ్” షో పాపులర్ అయింది.
Video Advertisement
అయితే.. అనుకున్నంతగా ఈ షోకి టిఆర్పి రేటింగ్స్ రాలేదు. దీనికితోడు, ఇటీవల వచ్చిన వార్తల్లో తమన్నా ప్లేస్ లో యాంకర్ అనసూయను తీసుకొస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అలాగే.. అనసూయను మాస్టర్ చెఫ్ యాంకర్ గా తీసుకున్నారు. అయితే.. తమన్నా తప్పుకోవడం వల్లే అనసూయను తీసుకొచ్చి ఉంటారు అని అనుకున్నారు. కానీ, తమన్నాను తప్పించి అనసూయను తీసుకొచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా “మాస్టర్ చెఫ్” నిర్వాహకులపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ క్రమంలో తమన్నా తరపు లాయరు కీలక వ్యాఖ్యలు చేసారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
ఈ వార్తల సారాంశం ఏమిటంటే.. మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నాకు సరిగా పేమెంట్స్ చేయలేదట.. ఈ షో కోసం తమన్నా మరో ప్రాజెక్ట్ ని కూడా వదులుకుంది.. కానీ మాస్టర్ చెఫ్ నిర్వాహకులు ఆమెను అర్ధాంతరంగా తప్పించడమే కాకుండా.. తమన్నాతో కమ్యూనికేషన్ ను కట్ చేసారట.. దీనితో తమన్నాకు లీగల్ యాక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందట.. అయితే, ఈ విషయమై ఇప్పటివరకు “మాస్టర్ చెఫ్” నిర్వాహకులు స్పందించలేదు.