లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించిన వారి మీద కొరడా జులిపించిన తెలంగాణ పోలీసులు !

లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించిన వారి మీద కొరడా జులిపించిన తెలంగాణ పోలీసులు !

by Anudeep

Ads

లాక్ డౌన్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలన్న ప్రభుత్వాల, పోలీసుల మాటలు ఇంతకు లెక్క చెయ్యడం లేదు. తెలంగాణ లో ఉదయం 10 గంటలవరకు మాత్రమే ప్రజలకి వెసులుబాటు కల్పించారు.అయిన కూడా 10 గంటల తరువాత కూడా ప్రజలు రోడ్ల పైన తిరుగ్తూనే ఉన్నారు .

Video Advertisement

traffic-violations-in-telangana

traffic-violations-in-telangana

అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇటీవలే తెలిపారు.15 వేల వాహనాలను జప్తు చేసినట్టు వివరించారు. లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించిన వారి పై వెయ్యి రూపాయల జరిమానా తో పాటుగా వాహనాన్నితాత్కాలికంగా జప్తు చేస్తున్నామని చెప్పారు.తగిన జరిమానా ను చెప్పించినప్పటికీ లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత మాత్రమే వాహనాల్ని తిరిగి అప్పగిస్తామని కూడా చెప్పుకొచ్చారు.మే నెల రెండు వారాలకే 4.31 లక్షల కేసులు నమోదు చేశామని ఇక ముందు కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు ఇప్పటి దాకా మాస్కులు ధరించని వారి నుంచి రూ. 31 కోట్లను జరిమానాలు గా వసూలు చేశామని చెప్పారు.

ఇవి కూడా చదవండి : ఎన్ని సంవత్సరాలు ఇంటికి అద్దె కడితే…ఆ ఇల్లు మీ సొంతం అవుతుందో తెలుసా.?


End of Article

You may also like