గుంటూరు కారంలో పాట కోసం “కుర్చీ మడతపెట్టి” డైలాగ్ చెప్పిన తాతకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసా..?

గుంటూరు కారంలో పాట కోసం “కుర్చీ మడతపెట్టి” డైలాగ్ చెప్పిన తాతకి ఎంత డబ్బులు ఇచ్చారో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్స్, ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసింది.

Video Advertisement

తాజాగా గుంటూరు కారం మూవీ నుండో  ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ అయిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డైలాగ్ తో పాపులర్ అయిన తాత మరియు ఈ పాట  కోసం తాతకు ఇచ్చిన పారితోషికం గురించి నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అతడు, ఖలేజా సినిమాల తరువాత, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు పాటలు రిలీజ్ చేయగా, మొదటి పాటకు మంచి రెస్పాన్స్ రాగా, రెండవ పాట ట్రోలింగ్ బారిన పడింది.తాజాగా కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈ రోజు 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ డైలాగ్ తో  పాపులర్ అయిన తాత వార్తల్లో నిలిచాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ తాత పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన మాట్లాడుతూ తన డైలాగ్ సినిమాలో వాడినందుకు తమన్ లక్షరూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. మహేష్ బాబు లాంటి పెద్ద  హీరో మూవీలో తన డైలాగ్ ను సాంగ్ గా వాడుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Also Read: సంక్రాంతి పై కన్నేసిన ప్రభాస్ ఏ సినిమా అంటే…!


End of Article

You may also like