చిక్కుల్లో ఆస్కార్ సినిమా డైరెక్టర్..! సినిమాలో నటించిన వాళ్లే..? ఏం జరిగిందంటే..?

చిక్కుల్లో ఆస్కార్ సినిమా డైరెక్టర్..! సినిమాలో నటించిన వాళ్లే..? ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె పై  ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో నటించిన బెల్లీ, బొమ్మన్‌ దంపతులు ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం, లీగల్‌ నోటీసులు వరకు వెళ్ళింది.

Video Advertisement

సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఇచ్చిన మాట తప్పడంతో ఈ వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. బెల్లీ, బొమ్మన్‌ దంపతులు తాజాగా రెండు కోట్ల లీగస్‌ నోటీస్‌ను దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ పంపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ  విషయం హాట్ టాపిక్ గా మారింది.
‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో తమకు సహాయం చేస్తానని డైరెక్టర్ కార్తికి మాట ఇచ్చారని, బెల్లీ, బొమ్మన్‌ దంపతులు చెబుతున్నారు. ఆమే ఇచ్చిన మాటను ఇంతవరకు నెరవేర్చలేదని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా ఇల్లు, తన మనవరాలు చదువుకు సాయం, వాహనం కోసం మూవీకి వచ్చిన కలెక్షన్స్ లో కొంత ఇస్తానని చెప్పారని లీగల్ నోటీసులో తెలిపారు.
ఆస్కార్‌ అవార్డ్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ నుండి దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ పురస్కారాలు పొందారని బెల్లీ, బొమ్మన్‌ దంపతులు చెప్పారు. అయితే తమకు మాత్రం ఏమి చేయలేదని, ఆస్కార్‌ వచ్చిన తరువాత జరిగిన సన్మాన సభల్లో కూడా ఆస్కార్‌ ను పట్టుకోనివ్వలేదని వారు పేర్కొన్నారు.  ఆ డాక్యుమెంటరీలో నటించిన తరువాత తాము ప్రశాంతత పోగొట్టుకున్నామని ఆ దంపతులు తమ బాధను వ్యక్తం చేశారు.‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ నిర్మాణ సంస్థ బెల్లీ, బొమ్మన్‌ దంపతులు చేసిన ఆరోపణల పై స్పందించి, వారు చెప్పే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్‌ కు బెల్లీ, బొమ్మన్‌ దంపతులు రెండు కోట్ల పరిహారం ఇవ్వాలంటూ లీగల్‌ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని మరొక కోణం..! అసలు ఏం ఉంది ఇందులో..?

 

 


End of Article

You may also like