15 కోట్లతో తీసిన సినిమా…ఏకంగా 304 కోట్లు వసూలు చేసింది.! 9 నెలల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సెన్సేషన్ సినిమా చూసారా.?

15 కోట్లతో తీసిన సినిమా…ఏకంగా 304 కోట్లు వసూలు చేసింది.! 9 నెలల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సెన్సేషన్ సినిమా చూసారా.?

by Harika

Ads

ఏ సినిమాని అయినా థియేటర్లో విడుదలైన తర్వాత నెలకో, రెండు నెలలకో ఓటీటీలో విడుదల చేసేస్తారు. కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఏకంగా 9 నెలలు అయినా ఇంకా ఓటీటీలోకి రాలేదు. పోనీ ఫ్లాప్ సినిమా నా? అనుకుంటే 2023లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటి గా నిలిచింది ఈ సినిమా. కేవలం 15 కోట్లతో సినిమాని నిర్మించి ఏకంగా 304 కోట్లను సంపాదించుకుంది.

Video Advertisement

ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న టైం లో దీని ఓటీటీ రిలీజ్ డేట్ ను విడుదల చేసింది చిత్రం బృందం. ఇంతకీ ఆ సినిమా మరి ఏదో కాదు, ‘ది కేరళ స్టోరీ‘. అదా శర్మ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమా కిందటి సంవత్సరం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో కొన్ని సున్నితమైన పాయింట్లకి కొన్ని రాష్ట్రాలలో అయితే ఈ సినిమాని బ్యాన్ చేసేసారు కుడా.

అయినా సరే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా.ఏ సినిమాకి అయినా ఒక రెండు మూడు నెలలు హవా నడిచి తర్వాత ఆగిపోతుంది. కానీ విడుదల అయ్యి తొమ్మిది నెలలు అయినా ఇప్పటికీ ఈ సినిమా హవా నడుస్తూనే ఉంది. థియేటర్ కి వెళ్లని చాలామంది ప్రేక్షకులు అసలు అంత హైప్ తెప్పించేలా ఈ సినిమాలో ఏముంది అని ఓటీటీలో చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.

siddhi idnani post about the kerala story movie..!!

అంత ఆసక్తిగా ఎదురు చూసి ప్రేక్షకులకు శుభవార్తగా సినిమా ott రిలీజ్ డేట్ రివీల్ చేసింది చిత్రం బృందం. ఫిబ్రవరి 16న జీ ఫైవ్ లో ఈ సినిమా  విడుదల అయ్యింది.  దీన్ని స్వయంగా అదా శర్మనే తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది. ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురుచూసే ఈ సినిమా ఆఖరికి రావడంతో అందరూ సినిమా చూడ్డానికి ఆరాటపడుతున్నారు.


End of Article

You may also like