రైల్వే స్టేషన్ లో ఈ మహిళ చేసిన మంచిపని తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.! (వైరల్ వీడియో)

రైల్వే స్టేషన్ లో ఈ మహిళ చేసిన మంచిపని తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.! (వైరల్ వీడియో)

by Megha Varna

Ads

చాలా మంది జంతువులని ప్రేమిస్తారు. పైగా నచ్చిన జంతువులు కనబడితే ఎంతో ఆనందంగా పలకరిస్తారు. కేవలం ఇళ్లల్లో పెంచుకునే వాటి మీదే కాదు చాలా మంది వీధి లో కనపడే జంతువుల్ని కూడా ఎంతో దయ తో చూస్తారు. ఈ మధ్య అందమైన పెట్స్ ఎక్కడైనా కనబడుతూ ఉంటే చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు.

Video Advertisement

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రైల్వే స్టేషన్ లో ఒక మహిళ వీధి కుక్క ని దగ్గరికి తీసుకుని అన్నం తినిపించింది. సోషల్ మీడియా లో ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది. మరి ఇక వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్ లోని దమ్ దమ్ కంటోన్మెంట్ లోని రైల్వే స్టేషన్ కి ఒక మహిళ వచ్చింది. ఆమె రైల్వే ప్లాట్ ఫామ్ మీద కూర్చుంది. ఆ తర్వాత కొంత సేపటికి ఒక వీధి కుక్క అక్కడికి వచ్చింది. ఎంతో ప్రేమ తో ఆ కుక్క వద్దకి వెళ్లి ప్రేమగా పెరుగన్నం పెట్టింది ఆ మహిళా.

అయితే ఈ కుక్క కేవలం పెరుగన్నం మాత్రమే తింటుంది అని ఆమెకి తెలుసు. అందుకని ఈ మహిళ రోజు కి మూడు సార్లు వచ్చి ఆ కుక్కకి పెరుగన్నం పెడుతుంది. ఇంటి పనులు లేదా ఆఫీస్ పనుల తో తీరిక లేదన్న మహిళలు ఉన్న ఈ రోజుల్లో కేవలం కుక్క కోసం రైల్వే స్టేషన్ కి మూడు సార్లు వచ్చి ఈమె పెరుగన్నం పెట్టడం గొప్ప విషయం అనే చెప్పాలి. కుక్క కి ఈమె పెరుగన్నం పెడుతున్నప్పుడు అక్కడ వుండే ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేశారు. కొద్ది గంటలకే ఆ వీడియో కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

https://youtu.be/vFWnuvtl2-c


End of Article

You may also like