బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మార్పులు..? ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే..??

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మార్పులు..? ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే..??

by Anudeep

Ads

బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్ కొంత నిరాశపరిచినమాట వాస్తవమే. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు. దీనితో ఐదో సీజన్ లో సెలెబ్రిటీలు కూడా ఉండేలా చూసుకున్నారు.

Video Advertisement

bigboss

కానీ.. ఇప్పటికే వైరల్ అవుతున్న లిస్ట్ లో ముగ్గురు మాత్రం ఫైనల్ లిస్ట్ లో లేరు అని తెలుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. కొత్త లిస్ట్ లో ఇషాచావ్లా, నవ్య స్వామి, వర్షిణి ల పేర్లు కూడా లేవని తెలుస్తోంది. వారికి బదులు గా మరికొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయని సమాచారం. డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సింగర్ రామ చంద్ర, యూట్యూబర్ సరయు, యాక్టర్ విశ్వ ల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 3 వ తేదీ వరకు వీరి మొబైల్స్ కూడా వీరివద్దే ఉంటాయట.

bigboss 2

ఆ తరువాత 4 వ తేదీనుంచి షో లో పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది. కంటెస్టెంట్ లను పరిచయం చేసే రోజున నాగార్జున “ఆరడుగుల బుల్లెట్” సాంగ్ కి డాన్స్ వేస్తారని బజ్ వినిపిస్తోంది. బజ్ ప్రోగ్రాం కి గాను అరియనా హోస్ట్ గా వ్యవహరిస్తోందని సమాచారం. ఇంతకీ ఈ మార్పుకు కారణం ఏంటంటే.. ఒక కంటెస్టెంట్ కు పాజిటివ్ గా తేలడమే. మరో ఇద్దరు కూడా తమ ఫ్యామిలీ డాక్టర్ లను పిలిపించుకుని టెస్ట్ లు చేసుకున్నారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ వీరితో ఫోటో లు దిగడం తో వీరి పేర్లు కూడా లీక్ అయ్యాయట. అందుకే వారిని తప్పించి మరో ముగ్గురుని తీసుకుంటున్నారు అని ఈ వార్తల సారాంశం.


End of Article

You may also like