Ads
ఓ భర్త అడగకుండా పానీ పూరి తీసుకొచ్చాడని .. అతని భార్య అలిగి, ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్ర లో పూణే లో చోటు చేసుకుంది. గహినీనాథ్ సర్వాడే, ప్రతీక్ష.. వీరిద్దరూ భార్యా భర్తలు. వీరిద్దరికి పడటం లేదు. అనుక్షణం గొడవ పడుతూనే ఉన్నారు అని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం గహిని నాధ్ ఇంటికి వెళ్తూ పానీపూరి ని తీసుకెళ్లాడు.
Video Advertisement
అయితే.. తనను అడగకుండా పానీ పూరీని ఎందుకు తెచ్చావ్ అంటూ భార్య ప్రతీక్ష గొడవ పడింది. తాను అప్పటికే వంట పూర్తి చేసేయడం తో.. గొడవ మొదలైంది. చిన్న గా మొదలైన గొడవ ముదిరి పాకాన పడింది. శనివారం రోజు.. ఆవేశం లో ప్రతీక్ష విషం తీసుకుంది. దీనితో ఆమెను ఆసుపత్రి లో చేర్పించాల్సి వచ్చింది. ఆమె చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article