హైటెక్ సిటీ వెనకున్న అసలు చరిత్ర చెప్పిన “కెసిఆర్”!

హైటెక్ సిటీ వెనకున్న అసలు చరిత్ర చెప్పిన “కెసిఆర్”!

by Anudeep

Ads

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కి చేసింది ఏమి లేదా ? నేను సీఎం గా ఉన్న హయాంలోనే వచ్చింది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..కానీ సీఎం కెసిఆర్ హైటెక్ సిటీ  చరిత్ర గురించి ఏమన్నారు అంటే ఆయనమాటల్లోనే

Video Advertisement

ఐటీ కూడా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు.! అవును నాకు సత్యం తెలుసుకాబట్టి చెబుతున్నాను.ఐటీ లో ఏమి జరిగిందో తెలుసా అండి అసలు? అన్నీ లేవు కొన్ని కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్దగా ఎస్టాబ్లిష్ అయినయి.తరువాత ఏమి జరిగింది అంటే.వాళ్ళ యొక్క బ్యాక్ అప్ మెకానిజం అంటారు దీన్ని.రెండు పదాలు రాసుకోవాలి మీరు దయచేసి బ్యాకప్ మెకానిజం అంటారు ఒకటి .డిజాస్టర్ మెకానిజం అంటారు రెండు. సపోజ్ మనం ఇక్కడ ఉన్నామ్ మంచిగా పరిశోధన చేసాం కనిపెట్టాం ఇది డిస్ట్రాయ్ కావొద్దు భూకంపం వచ్చిన,ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు ,? సేఫ్ జోన్ ప్రపంచం లో ఎక్కడ ఉందొ అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దీన్ని.బ్యాకప్ మెకానిజం అంటారు దీన్ని వాళ్ళు IB లాంటి పెద్ద సంస్థ మొదుట స్టార్ట్ చేసింది. IB వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు.

 

నాకు సత్యం తెలుసు కాబట్టి చెబుతున్న ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిష్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా ఎంక్వయిరీ చేసి మొత్తం గ్లోబ్ అప్పుడు సెస్మా లాజికల్ అంటే… భూకంపాలు అతితక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే? అది హైద్రాబాద్ సిటీ డెక్కన్ ప్లాటు. అతి తక్కువ భూకంపాలు వస్తాయి. సముద్రానికి క్లోజ్ గా లేదు కాబట్టి తుఫాన్ లు కూడా రావు.తుఫాన్ ఇంపాక్ట్ ఉంటది కానీ ఎక్కువ చూపెట్టదు.వాష్ అవుట్ కాదు. క్లైమేట్ కండీషన్ కూడా  ఎక్స్ట్రీమ్ కాదు. ఎక్సలెంట్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. వెరీ వెరీ హై టెంపరేచర్స్ కి పోవు ఫ్రీజం కోల్డ్ కి పోవు .అనేకమైన అనుకూలతలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తించి హైద్రాబాద్ ను వాళ్ళు సెలెక్ట్ చేసారు. హైద్రాబాద్ ను రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చెయ్యలేదు.

వాళ్ళు సెలెక్ట్ చేసుకుని రాజీవ్ గాంధీ ని రిక్వెస్ట్ చేసుకున్నారు.వారు దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది. అక్కడ మా సెర్వర్స్ పెట్టుకుంటాం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం మాకు పర్మిషన్ ఇప్పించండి అని అన్నారు. అప్పుడు  ఇక్కడ  జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి ని ఢిల్లీ కి పిలిపించి ఇది మంచి అవకాశం. ఇది మీరు ఏర్పాటు చేసుకోండి IT పెరుగుతది మీ సిటీ లో. మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ కంపెనీలు అంటున్నాయి. దీని ఛాన్స్ గా తీసుకొని పెట్టుకోమన్నారు.

 

జనార్దన్ రెడ్డి. ఆయన సైబర్ టవర్స్ కి పునాది రాయి ఏసిండు.  హైద్రాబాద్ సిటీ కి ఉండేటువంటి స్వాభావిత భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల IT అనేది హైద్రాబాద్ రావటం ప్రారంభం అయ్యింది దాన్ని అతి గొప్పగా నేనే చేసిన అని డప్పు కొట్టుకొని మార్కెటింగ్ చేసుకునేటోడు చంద్రబాబు నాయుడు ఎస్ ! మా డబ్బా మేము కొట్టుకున్నామా అండి ఒక అయిదు కంపెనీలు తెచ్చినం మా గోవేర్నమేంట్ లో వరల్డ్ టాప్ కంపెనీస్ చెప్పినం ఒక నాలుగు మాటలు చెప్పినం నేను కావచ్చు ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు సందర్భాన్ని బట్టి చెప్పినం అవసరాన్ని బట్టి చెప్పినం అంతే .ఎందుకు చెప్తం ఫర్దర్ ఇంకో నాలుగుకంపెనీలు రావాలె అని చెప్తం  .


End of Article

You may also like