Ads
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు తనకు కలిసొచ్చిన అదే జోనర్ లో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ రిలీజ్కి సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటించింది. అలానే విలన్గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించాడు.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్స్తో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ రిపోర్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీరసింహారెడ్డి ఇన్ సైడ్ రిపోర్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం పూర్తి స్థాయి మాస్ చిత్రం అని అంటున్నారు.
కాగా ఈ చిత్రం యొక్క మొదటి 45 నిమిషాలు శృతి హాసన్, బాలకృష్ణ లవ్ ట్రాక్ ఉంటుందని, ఆ తరువాత సీనియర్ బాలకృష్ణ పాత్రను పరిచయం చేస్తారని, అప్పటి నుండి ఈ చిత్రం పూర్తి మాస్ విందుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ టీజర్స్, ప్రోమోలు చూస్తే ఈ సినిమా హై యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, వీరసింహారెడ్డి సినిమా లేక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇన్ సైడ్ రిపోర్టుల ద్వారా సమాచారం అందుతోంది.
మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని త్రోవ గుంట సమీపంలో ఉన్న అర్జున్ ఇన్ఫ్రాలో శుక్రవారం జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. దాంతో ఈ ఈవెంట్లోనే ట్రైలర్ని సరిగ్గా రాత్రి 8:17 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. వీరసింహా రెడ్డి టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. ప్రీరిలీజ్ ఈవెంట్ని ఒంగోలులోనే నిర్వహించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
End of Article