Ads
దేశం ఎంతగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నా.. అమ్మాయిల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధి మాట పక్కన పెడితే.. వారు నిత్యం వేధింపులకు గురి అవ్వాల్సి వస్తోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ పడితే ఒంటరిగా ఉంటే వేధింపులను ఎదుర్కోక తప్పడం లేదు.
Video Advertisement
తాజాగా ఓ అమ్మాయి ఇలానే బస్టాండ్ లో ఒంటరి గా కూర్చుని ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు వచ్చాడు. ఆ అమ్మాయి తాను ఎక్కాల్సిన బస్ కోసం ఎదురుచూస్తోంది. అయితే.. ఆమె ఒంటరి గా కనిపించడం తో ఓ ఆకతాయి వచ్చి ఆమెను “నీ పక్కన కూర్చోవచ్చా..?” అని అడిగాడు. ఆమె కూర్చోమని చెప్పగానే.. ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు.
ఈ తతంగాన్ని చూసిన మరో కుర్రాడు కూడా ఆమెను అలానే అడిగాడు. ఆమెకు మరో వైపుకు దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఆమె తన ఒంటిపై కప్పుకున్న తువ్వాలును లాగేసాడు. ఆమెను లైంగికం గా వేధించడానికి వారిద్దరూ ప్రయత్నించారు. ఆ టైం లోనే ఆమె అలెర్ట్ అయి తన ముసుగు ని తొలగించేసింది. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఆమెను చూసి ఆ కుర్రాళ్ళు షాక్ అయ్యారు.
ఆమె వాళ్ళను బెదిరించి గుంజిళ్ళు తీయించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియోను ముందే ప్లాన్ చేసి డ్రామా లా తీశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రోడ్డు పై ఒంటరిగా కనిపించే అమ్మాయిలను ఆటపట్టించే ఆకతాయిలకు ఇది ఓ గుణపాఠం లాంటిదే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి…
Watch Video:
🤣🤣🤣 pic.twitter.com/Gu0pn3oVub
— Best of the Best (@bestofallll) September 14, 2021
End of Article