• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

విశాఖలో జరిగిన విషాద సంఘటన విజువల్స్…ఈ 20 ఫోటోలు చూస్తే కన్నీళ్లాగట్లేదు!

Published on May 7, 2020 by Sainath Gopi

ఒకవైపు ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తుంటే , ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా వాసులకు మరో ఘటన కుదిపేసింది..ఎప్పుడు ఎక్కడ కరోనా ఎవరికి సోకుతుందో తెలియక భయపడుతూ , బిక్కు బిక్కుమంటూ పడుకున్న ప్రజలను , నిద్రలో ఉండగానే మృత్యువు మరో రూపంలో కబలించింది.  ఎక్కడి జనం అక్కడ కుప్పకూలిపోతున్నారు, జంతువులు గిలగిల కొట్టుకుంటూ చనిపోతున్నాయి.ఇంతకీ వైజాగ్లో  ఏం జరిగింది?ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది??

తెల్లవారుఝామున 4గంటలకు

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే.ఈ రోజు పరిశ్రమ తెరిచే ప్రయత్నం జరిగిందని సమాచారం. ఆ క్రమంలో పరిశ్రమలో ప్రమాదం సంభవించి భారీగా రసాయన వాయువు లీక్ అవ్వడంతో 3 కిలోమీటర్ల​ మేర గ్యాస్ వ్యాపించింది. లీకైన గ్యాస్ ని స్టెరీన్ గా గుర్తించారు..పాలిమర్స్ తయారిలో ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

భయంతో పరుగులు పెట్టిన జనం

పరిశ్రమ చుట్టుపక్కల సుమారు ఆరు గ్రామాల వరకు ఉంటాయి.. అందరూ నిద్రలో ఉండడం లీకైన గ్యాస్ పీల్చడంతో స్థానికులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.ఈ గ్యాస్ కి పీల్చిన వారు ఎక్కడిక్కడ కుప్పకూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయి సైరన్ మోగించారు..పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు కొట్టి ప్రజలను నిద్రలేపారు. సుమారు మూడు కి,మీ మేర గ్యాస్ వ్యాపించడంతో రోడ్లపైన ఎక్కడిక్కడ జనం కుప్పకూలిపోయారు.  చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా ప్రమాదానికి గురైన ఈ ఘటనలో ఇప్పటివరకు 10మరణాలు సంభంవించాయి . సుమారు వందల సంఖ్యలో జనం స్పృహ తప్పిపడిపోయారు.

అంబులెన్సులు, బస్సులలో హాస్పిటల్ కి తరలింపు

కరోనా చికిత్స కోసం కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లు, ఆ ఏరియాకు దగ్గరలో ఉన్న సింహాచలం బస్ డిపో నుండి బస్సులను రప్పించి ప్రమాదానికి గురైన వారిని  హుటాహుటిన కెజిఎచ్ కి తరలించారు.. కరోనా పేషెంట్స్ కోసం ముందస్తుగా ఏర్పాటు చేసిన  వైద్య సదుపాయాలు, వెంటిలేటర్లు ఏర్పాటు చేయడంతో,  వందల సంఖ్యలో వస్తున్న జనానికి వైద్యం అందించడం, వెంటిలేటర్లు ఏర్పాటు చేయడం కొద్దిగా సులువయింది.

గ్రామాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు

పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి వసతి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ప్రజలు కూడా ఇల్లు ఖాళీ చేసి దూరప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. సుమారు 20వేల మందికి పైగా జనం ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి చేరుకున్నట్టు సమాచారం.. ప్రస్తుతం చుట్టూ ఉన్న గ్రామాలను ఖాళీ చేయించే పనిలో యంత్రాంగం ఉంది.

images source: sakshi


We are hiring Content Writers. Click Here to Apply



About Sainath Gopi

A Mechanical Engineer turned into an Author. Have 6 years of work experience by working as Web Content Manager for various top telugu websites. Expertise in writing Human angle stories, Unknown Facts and excusive film-based content. Enthusiastic in Lyric and Story Writing.

Search

Recent Posts

  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!
  • ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?
  • చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే… ఈ ఐదింటి వెనుక వుండే రహస్యం తెలుసుకోవాల్సిందే..!
  • నాగచైతన్య పెంపకంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమల.. వాళ్ళ అమ్మ దగ్గర పద్ధతిగా పెరిగాడంటూ..!!
  • బడి నుండి ఆమెని గెంటేసినా.. ఆమె మాత్రం చదువులో వెనుకపడలేదు…ఈ విద్యార్థి కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions