Ads
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. దీంతో ‘లైగర్’పై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకొంది.
Video Advertisement
టాలీవుడ్ లో వరుస పరాజయాలకు `లైగర్` బ్రేక్ వేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకొన్నాయి. దానికి తగ్గట్టే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ చూసిన నెటిజన్లు ఈ చిత్రాన్ని అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో పోలుస్తున్నారు.
అందులోని రవితేజను విజయ్ దేవరకొండతో, జయసుధను రమ్యకృష్ణతో, ప్రకాష్ రాజ్ ను మైక్ టైసన్ తో, ఆసిన్ ని అనన్య పాండేతో పోలుస్తూ కామెంట్ చేస్తున్నారు. అమ్మా నాన్న ఓ ముంబై పోరి అని సెటైర్లు కూడా వేస్తున్నారు నెటిజన్లు. ఇది వరకు `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`లో మదర్ సెంటిమెంట్ చూపించాడు పూరీ. అది కూడా బాక్సింగ్ కథే. అందుకే ఈ రెండు సినిమాలకూ పోలిక తీసుకొస్తున్నారు.
చూడాలి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో..! ఆగస్ట్ 25న లైగర్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ పై దృష్టి పెట్టింది చిత్ర బృందం. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఓ మీమ్ కింద ఇవ్వబడింది.
https://www.instagram.com/p/CgQuVdPJhri/?igshid=YmMyMTA2M2Y=
End of Article