బెంగళూరు పర్యటనలో మోదీ పక్కన నిలబడిన ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసా?

బెంగళూరు పర్యటనలో మోదీ పక్కన నిలబడిన ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలుసా?

by Anudeep

Ads

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి ఎన్ ఎస్ జి భద్రతా బలగాలను ఏర్పాటు చేసారు. వీరితో పాటు గా బెంగళూరుకు చెందిన అనేకమంది సీనియర్ పోలీస్ అధికారులు భద్రతా దళాలు మోడీకి రక్షణ కల్పించారు.

Video Advertisement

కాగా.. వీరందరిలో.. మోడీకి కేవలం రెండు మీటర్ల దూరంలో ఉండి కళ్ళకు కూలింగ్ గ్లాస్ లతో భద్రతా కల్పించిన ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ అందరి కళ్ళల్లో పడ్డారు. ఇంతకీ ఈ ఆఫీసర్ ఎవరు అని నెటిజన్లు ఓ తెగ సెర్చ్ చేసేస్తున్నారట.

ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ కి రెండు మీటర్ల దగ్గరలోనే ఉండి రక్షణ కల్పించిన ఈమె పేరు రీనా రఘు సువర్ణ. ఈమె బెంగళూర్ లోనే ఎసిపిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2014 లో ఈమె కర్ణాటక పోలీస్ విభాగంలో చేరారు. ట్రైనింగ్ లో ఉన్న సమయంలోనే ఆమె సీనియర్ అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు.

విధుల్లోకి చేరిన తరువాత అనేక క్లిష్ట సమస్యలను సాల్వ్ చేసి పై అధికారుల వద్ద నుంచి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా పేరు సంపాదించుకున్నారు. ఆమె టాలెంట్ ని గురితించిన పోలీస్ సీనియర్ అధికారులు ఆమెను ప్రధాని మోదికి రక్షణగా ఏర్పాటు చేసారు.


End of Article

You may also like