ముగ్గురు కూతుళ్లు ఉన్నా… కృష్ణంరాజు గారు ఇంకొక అమ్మాయిని ఎందుకు దత్తత తీసుకున్నారు తెలుసా.?

ముగ్గురు కూతుళ్లు ఉన్నా… కృష్ణంరాజు గారు ఇంకొక అమ్మాయిని ఎందుకు దత్తత తీసుకున్నారు తెలుసా.?

by Anudeep

Ads

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలను అలవోకగా పోషించి జనాలను మెప్పించిన ఆనాటితనం నటుడు కృష్ణంరాజు. ఆయన ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండేవాడు. నిజజీవితంలో చాలా సౌమ్యుడిగా ఆయన కు గుర్తింపు ఉంది.

Video Advertisement

ఆయన సినీ జీవితం ఎప్పుడూ ఒక తెరిచిన పుస్తకం లాగా స్పష్టంగా ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలు మాత్రం బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు అని చెప్పుకోవాలి.

తన తరువాత తన అన్న కుమారుడైన ప్రభాస్ తన నట వారసుడిగా సినీ రంగంలోకి తీసుకొచ్చాడు కృష్ణంరాజు. అంతేకాకుండా ప్రభాస్ కెరీర్ కు సంబంధించి అన్ని విషయాలు స్వయంగా ఆచీ తూచి జాగ్రత్తలు తీసుకునేవారు. వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే కృష్ణంరాజు గురించి ఆయన కుటుంబ జీవితం గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. కృష్ణంరాజు మొదట వివాహం ఆయన మేనమరదలు తో జరిగింది. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో కృష్ణంరాజు కొన్ని రోజులపాటు డిప్రెషన్ లో ఉండిపోయారు.

మరో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్న ఆయన ఆ సమయంలో ఓ అమ్మాయిని దత్తత కూడా తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి. కానీ కొన్నాళ్లకు ఇంట్లో వాళ్ళ వత్తిడి వల్ల శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆయనకు శ్యామలాదేవికి ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తనకు ముగ్గురు కూతుర్లు పుట్టినప్పటికీ ప్రశాంతికి మాత్రం కృష్ణంరాజు ఎటువంటి లోటు జరగనివ్వలేదు. ఆమె పెళ్లి కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ప్రస్తుతం ప్రశాంతి భర్త పిల్లలతో ఎంతో సుఖంగా జీవిస్తుంది. ఆమెకు కృష్ణంరాజు ద్వారా ఒక అందమైన జీవితం లభించింది. ఇక కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలకు ఇంకా వివాహం కాలేదు . అంతేకాదు ఆయన అన్న కుమారులు అయినా ప్రభాస్ మరియు ప్రబోధ్ లకు కూడా ఇంకా పెళ్లి కాలేదు.


End of Article

You may also like