Ads
వివాహేతర సంబంధాలు ఎంత దారుణానికి అయినా ఒడిగడుతుంటాయి. తాజాగా.. విడాకులు తీసుకుందామనుకున్న కోడలిని మామే హత్య చేసిన ఘటన తిరుపత్తూరు జిల్లా నటరామ్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Video Advertisement
ఆమె వృత్తిరీత్యా టీచర్. అతను దేశ సరిహద్దుల్లో సేవలు అందించే ఆర్మీ జవాన్. ఆమె మరొకరితో ఎఫైర్ పెట్ట్టుకున్న కారణంగా వారిద్దరికీ గొడవలు వచ్చాయి. విడిపోదాం అని అనుకున్నారు. అంతలోనే ఆమె హత్యకి గురైంది.
వివరాల్లోకి వెళితే, తిరుపత్తూరు జిల్లా నటరామ్పల్లికి చెందిన శివ (40) ఆర్మీ లో జవాన్ గా పని చేస్తున్నాడు. 2009 లోనే మురుగమ్మల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగరీత్యా శివ క్యాంపుకు వెళ్ళేవాడు. ఈ క్రమంలో మురుగమ్మల్ అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో వారిద్దరికీ గొడవలు వచ్చాయి.
ఇద్దరు విడిపోవాలని అనుకున్నారు. విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో మురుగమ్మాల్ అత్తింటిలోనే ఉంటోంది. దీనితో.. ఆమె ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలనీ.. ఆ ఇల్లు తన కొడుకుది అంటూ మురుగమ్మల్ మామగారు గొడవ చేసారు.
అయితే ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఆవేశంలో వంటగదిలో ఉన్న కత్తితో దాడి చేసాడు. ఈ క్రమంలో మురుగమ్మల్ మృతి చెందింది. ఆమె మామగారు తనంతట తానె పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. మురుగమ్మల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
End of Article