భర్త కోసం అలుపులేని పోరాటం చేస్తున్న భార్య..! కారణమేంటంటే..?

భర్త కోసం అలుపులేని పోరాటం చేస్తున్న భార్య..! కారణమేంటంటే..?

by Anudeep

Ads

ప్రియుడు మోజులో పడి భర్తను హత్య చేస్తున్న భార్యలు పెరుగుతున్నా ఈ రోజుల్లో.. ఓ భార్య, భర్త కోసం అలుపెరుగని పోరాటం చేస్తోంది. తన భర్త కాపురానికి రానివ్వట్లేదని, భర్త తనకు కావాలని ఓ ఇల్లాలు కర్నూలు జిల్లాలో భర్త ఇంటి ముందు పోరాటానికి దిగింది.

Video Advertisement

ఉన్నత విద్య చదివి.. సమజంలో మంచి గుర్తింపు ఉన్న తనపై పిచ్చి పట్టిందనే ముద్ర వేసి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఇల్లాలు వారం రోజుల నుంచి భర్త ఇంటి ముందు పోరాటం చేస్తోంది. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయికి చెందిన ఉమామహేశ్వరి కి 2017 లొద్దిపల్లికి చెందిన బెల్లం విష్ణువర్ధన్ రెడ్డితో వివాహమైంది. పెళ్లి సందర్భంగా 30 లక్షల కట్నకానుకలు ఇచ్చారు.

విష్ణువర్ధన్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. కానీ పెళ్లయిన రెండు వారాలకే వీరి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. పుట్టింటికి వెళ్లిన ఉమామహేశ్వరిని తిరిగి భర్త ఇంటికి కాపురానికి పంపేందుకు పెద్దనుషుల ద్వారా ప్రయత్నించారు. ఒక దశలో పోలీసులు పంచాయతీ ద్వారా ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. మరో వైపు విడాకులు కావాలంటూ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కోర్టు నోటీస్ ఇచ్చారు.

భర్త విడాకులు తనకు వద్దంటూ భర్తే కావాలంటూ ఉమా మహేశ్వరి ఓర్వకల్ మండలం లొద్దిపల్లిలో భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. భర్త ఇంట్లోకి వెళ్లిన ఆమె.. అక్కడే 5 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంది. కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనినే ఉద్దేశంతో.. ఆ ఇంట్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఎవరో ఏదో ఒక పూట ఇంత అన్నం పెడితే తిని వారం రోజులుగా భర్త ఇంటి దగ్గరే ఆందోళనకు దిగింది.

అయితే తనకు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని.. అలాగే అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు మాత్రం.. భర్తతో కాపురం చేయాలని ఉందని.. వారి డబ్బులు , ఆస్థులు అవసరం లేదంటుంది ఉమామహేశ్వరి. తనకు న్యాయం చేయాలని , అప్పటి వరకు నా పోరాటం ఆగదంటుంది ఉమామహేశ్వరి.

అయితే ఉమా మహేశ్వరి ఆందోళనపై అత్త యశోద వాదన భిన్నంగా ఉంది. పెళ్లయిన కొత్తలోనే కాపురం చేయకుండా వెళ్ళిపోయి తమపై లేనిపోని కేసులు పెట్టిందని ఆమె ఆరోపిస్తోంది. తన కుమారుడిని కేసులతో వేధించారని, విసుగుచెంది భార్య వద్దని విడాకులు కోరుతున్నారని చెబుతోంది. ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తున్నారని చెబుతోందామె. విష్ణువర్ధన్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.


End of Article

You may also like