Ads
వరుసగా స్టార్ హీరోస్ తో, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ పై వచ్చిన ప్రతి సినిమా మెజారిటీ అఫ్ సక్సెస్ని సాధిస్తున్నాయి. ఈ విజయాలతోనే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్.
Video Advertisement
సినిమాల పై వచ్చిన ఎలాంటి నెగటివ్ టాక్ నా తమకి అనుకూలంగా మార్చుకుని విజయాలను సొంతం చేసుకుంటుంది. పుష్ప ది రైస్ చిత్రానికి మొదటి రోజుల్లో నెగిటివ్ రివ్యూస్ అందించారు క్రిటిక్స్.
ఈ నెగిటివ్ టాక్ వల్ల పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సంపాదిస్తుందా అనే ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఉపయోగించినా ప్లానింగ్, స్ట్రాటజీ, ప్రమోషన్స్ వల్ల ఆశించిన స్థాయి కంటే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు సర్కారు వారి పాటలు కూడా అదే నెగిటివ్ టాక్ బాటలో నడుస్తుంది . ఫస్టాఫ్ మొత్తం కామెడీతో అదిరిపోయిన సర్కారీ వారి పాట, సెకండాఫ్ మొత్తం యాక్షన్ తో సాగదీసినట్లుగా ఉందని నెగిటివ్ టాక్ వెలువడింది. దీనితో మహేష్ బాబు సక్సెస్ ట్రాక్ కి బ్రేక్ పడనుందా అనే కామెంట్స్ వినిపించాయి. నెగిటివ్ టాక్ తో మొదలైన సర్కారీ వారి పాట మొదటి వారంలో కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుకుంది.
తాజాగా ట్విట్టర్ లో సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అని ట్రేడింగ్ కావడంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల కష్టం ఎంతగా ఉందో తెలుస్తుంది అని నెటిజన్ల నుంచి కామెంట్స్ వెలువడ్డాయి. వీకెండ్లో కూడా సర్కారు వారి పాట భారీ కలెక్షన్లను రాబట్టుకుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకొంచెం పెంచి ఉంటే, సినిమా ఫలితం మరోలా ఉండేదని చెప్పవచ్చు. భరత్ అనే నేను, శ్రీమంతుడు, మహర్షి సినిమాలతోపాటు సర్కారు వారి పాట కూడా మహేష్ బాబు ఖాతాలో ఇంకో హిట్ పడినట్లే.
End of Article