Ads
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.
ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వర్షన్స్ జీ 5 లో విడుదల అయ్యాయి. హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో విడుదల అయ్యింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ గురించిన టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందరికీ అందుబాటులో ఉండడంతో.. ఈ సినిమాను చూసి తెగ చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి ఓ లాజిక్ ను మిస్ అయ్యారని అభిమానులు గుర్తించారు.
ఈ సినిమాలో ఓ చోట ఎన్టీఆర్ కాగడాలు పట్టుకుని బోనుల పైనుంచి వస్తుంటాడు. ఆ సీన్ లో నిశితంగా గమనిస్తే ఎన్టీఆర్ పక్కన ఉన్న ఒక బోన్ లో పులులు, జింకలు కలిసి ఉంటాయి. నిజానికి ఈ రెండిటికి జాతి వైరం ఉంది. జింకలను చూస్తే పులులు చంపి తినకుండా వదిలిపెట్టవు. మరి ఈ రెండిటినీ ఒకే బోన్ లో ఎలా ఉంచారు..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జక్కన్నా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. సినిమా అన్నాక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. దీని వలన కథకి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే.. కొన్ని కొన్ని పొరపాట్లను ఇలా ప్రశ్నించుకుంటుంటాం అంతే..
End of Article