Ads
‘గ్యాంగ్లీడర్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతోంది.
Video Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఓ అదిరిపోయే కథతో రజినీతో సినిమా చేస్తున్నారు నెల్సన్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన సూపర్ స్టార్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ పెట్టడంతో ఈ మూవీ ఖాదీల నేపథ్యంలో ఉంటుందని అర్ధమవుతోంది. ఈ సినిమాలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఒక పాత్రకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంచుకున్నారు.
ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. అయితే ప్రియాంక అరుళ్ మోహన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దర్శకుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఈ సినిమానుంచి తప్పుకుందని కోలీవుడ్ టాక్.
గతంలో నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ అనే సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ తో గొడవ కారణంగా ఆమె సూపర్ స్టార్ సినిమానుంచి తప్పుకుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
రజినీకాంత్ సినిమా ఛాన్స్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.. అలాంటిది ప్రియాంకకు తక్కువ టైంలోనే ఈ ఆఫర్ రావడం అంటే అదృష్టమనే చెప్పాలి.
‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ప్రియాంక అరుల్ మోహన్, శర్వానంద్తో ‘శ్రీకారం’ చిత్రంలో నటించింది. ఇటీవల తమిళంలో సూర్యతో ‘ఈటీ’ సినిమా చేసింది. రజనీతో సినిమా తన కెరీర్కు మరింత ఉత్సాహాన్నిస్తుందని ఈ నాయిక ఆశించింది. ప్రియాంక మోహన్ ప్రస్తుతం రాజేష్, జయంరవి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తున్నది.
నెల్సన్ ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తమిళ నాట మంచి టాక్ తెచుకున్నప్పటికీ మనదగ్గర మాత్రం పర్లేదు అనిపించుకుంది.
End of Article