విగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?

విగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?

by Mohana Priya

మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు. అదేంటి విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు.

Video Advertisement

నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ విగ్రహం లో ఒక మనిషి శవం ఉందట.

ఆ శవం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటిది. ఈ విషయం తెలిసి శాస్త్రవేత్తలు విగ్రహం లో శవం ఉండడం ఏంటి అని షాక్ అయ్యారు. తర్వాత పరిశీలన చేస్తే ఆ మనిషి శవం దాదాపు 11వ శతాబ్దం లేదా 12వ శతాబ్దానికి చెందినది అని తెలిసింది.

మమ్మీ సినిమా లో ఉన్నట్టు శవానికి మొత్తం వస్త్రం చుట్టేసి ఉందట. ఆ వస్త్రం మీద చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయట. దాంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలించి ఆ శవం లిక్వాన్ అనే అతనిది అని గుర్తించారు. లిక్వాన్ చైనా మెడిటేషన్ స్కూల్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఆ విగ్రహం ఇంకా పరిశీలన లోనే ఉంది.


You may also like

Leave a Comment